నిలిచిన రేషన్!
ఎండీయూ వాహనాల ఆపరేటర్ల వర్క్డౌన్తో శనివారం రెండు జిల్లాల్లో ఇంటింటికీ రేషన్ పంపిణీ నిలిచిపోయింది. బీమా పేరుతో ఆపరేటర్ల ఖాతాల నుంచి ఒక్కో ఎండీయూకి రూ.18,890 మొత్తాన్ని బ్యాంకులు మినహాయించడాన్ని నిరసిస్తూ వారంతా వర్క్డౌన్కు పిలుపునిచ్చారు.
ఎండీయూ వాహన ఆపరేటర్ల వర్క్డౌన్
రెండు జిల్లాల్లో తిరిగినవి 27 వాహనాలే
విజయనగరం తహసీల్దార్ బంగార్రాజుకు వినతిపత్రం ఇస్తున్న ఎండీయూ వాహనదారులు
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: ఎండీయూ వాహనాల ఆపరేటర్ల వర్క్డౌన్తో శనివారం రెండు జిల్లాల్లో ఇంటింటికీ రేషన్ పంపిణీ నిలిచిపోయింది. బీమా పేరుతో ఆపరేటర్ల ఖాతాల నుంచి ఒక్కో ఎండీయూకి రూ.18,890 మొత్తాన్ని బ్యాంకులు మినహాయించడాన్ని నిరసిస్తూ వారంతా వర్క్డౌన్కు పిలుపునిచ్చారు. తమ సమస్యను పరిష్కరిస్తే కానీ రేషన్ పంపిణీ చేయమని పలు చోట్ల వాహనాలను నిలిపివేశారు. తహసీల్దారు కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. దీంతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రజలకు రేషన్ అందలేదు. మొత్తం 566 వాహనాలకు 27 తిరిగినట్లు అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. వర్క్డౌన్ కొనసాగితే ప్రజలకు రేషన్ కష్టాలు తప్పవన్నది స్పష్టమవుతోంది.
* ఎండీయూ వాహనాల ద్వారా ప్రతి నెలా ఒకటి నుంచి 17వ తేదీ వరకు ఇంటింటికీ రేషన్ పంపిణీ జరుగుతోంది. వర్క్డౌన్తో సమీప జిల్లాల్లో వీఆర్వోలతో పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నా, ఇక్కడ ఇటువంటి పరిస్థితి లేదని చెబుతున్నారు. స్థానికంగా నేతల ఆదేశాలతో కొన్ని చోట్ల అందించినట్లు తెలిసింది.
చెబుతున్నదిలా..
* గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లిస్తానని హామీ ఇచ్చింది. నిబంధనల్లో కూడా పొందుపర్చారు. ఇటీవల మంత్రిని కలిసినప్పుడు ప్రభుత్వమే కడుతుందని చెప్పినట్లు కొందరు నిర్వాహకులు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
* బ్యాంకులు బీమా ప్రీమియం మొత్తాన్ని జీతాల ఖాతా నుంచి మినహాయిస్తోంది. మూడు నెలలుగా ఇదే పరిస్థితి ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేకపోవడంతో విధులు బహిష్కరించారు.
* 2022లో బీమా నిమిత్తం మినహాయించిన రూ.11,000 మొత్తానికి ఎటువంటి పత్రం ఇవ్వలేదు. ఏటా బీమా మొత్తం పెంచుతున్నారు.
* వాహనమిత్ర పథకం ద్వారా బీమా కింద రూ.పదివేలు మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినా అమలు కాలేదు. మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి.
ఎవరికీ చెప్పకుండానే..
రిజ్వాన్, ఎండీయూ సమాఖ్య యూనియన్ జిల్లా అధ్యక్షుడు
బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు చెప్పకుండా ఖాతాల్లో డబ్బులు తీసేస్తే ఎలా బతకాలి? హమాలీలకు డబ్బులు ఎలా చెల్లించగలం? మేం చేస్తున్నది ప్రభుత్వం, అధికారులపై వ్యతిరేక చర్య కాదు. బ్యాంకుల తప్పుగా భావిస్తున్నాం. ఏటా ప్రీమియం పెంపుపై స్పష్టత ఇవ్వాలి.
ఉన్నత స్థాయిలో చర్చలు
- కె.మధుసూదనరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి
ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సమస్య ఆదివారం నాటికి సద్దుమణుగుతుందని భావిస్తున్నాం. ప్రభుత్వం బీమా ప్రీమియాన్ని సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్కు తరలివెళ్లిన తెదేపా తమ్ముళ్లు
[ 25-04-2024]
తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర గురువారం నామినేషన్కు వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బలిజిపేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్లు పార్వతీపురం జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. -
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం