ఉద్యాన రైతు చూపు.. రాయితీ వైపు
ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా రాయితీల సొమ్ము జమ కావడం లేదు.
మూడేళ్లుగా అందని పథకాలలబ్ధి
న్యూస్టుడే, పార్వతీపురం పట్టణం
ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా రాయితీల సొమ్ము జమ కావడం లేదు. గత మూడేళ్లుగా అందక అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సకాలంలో రాయితీ సొమ్ము రాకపోవడంతో పెట్టుబడులకు చేసిన అప్పులపై వడ్డీ భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఉద్యాన పంటల సాగు ఎక్కువ. జిల్లావ్యాప్తంగా 58 వేల మంది రైతులు 1,01,017 ఎకరాల్లో మామిడి, బొప్పాయి, అరటి, జామ, అనాస, జీడి, కొబ్బరి, ఆయిల్ పామ్, టమాటా, వంకాయలు, చిక్కుళ్లు, పొట్లకాయలు, దుంప జాతులు, అల్లం, పసుపు, ఔషధ మొక్కలు, పూలు తదితర పంటలు సాగు చేస్తున్నారు. రైతులు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేలా ప్రోత్సహించేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3.19 కోట్లు రాయితీ నిధులు ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు నివేదికలు పంపారు.
అందేది ఎప్పటికో...
జిల్లాలో పండ్లు, కూరగాయలు, పూల తోటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. ఎంఐడీహెచ్ కింద గతేడాది రూ.93.73 లక్షలు, ఆర్కేవీవై కింద గత మూడేళ్లలో రూ.2.26 కోట్లు రాయితీ నిధులు ఇవ్వాలని జిల్లా నుంచి ఉద్యాన అధికారులు ఏటా ప్రతిపాదలు చేస్తున్నారు. కానీ.. ఇప్పటికీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు. ప్రతిపాదించిన మొత్తం వస్తుందా? అందులో కోత ఉంటుందా? అసలు జిల్లాకు ఎన్ని రూ.కోట్లు ఇస్తారనే విషయంలో స్పష్టత ఇంకా రాలేదు.
మార్కెట్లో ధరల మంట..
కూరగాయలు, పండ్ల విత్తనాల ధరలు ఆకాశాన్ని తాకాయి. కిలో రూ.వేలల్లో ఉండడంతో కొనేందుకు రైతులు అప్పులు చేస్తున్నారు. దానికి తోడు చీడ, పీడల నుంచి పంటల రక్షణకు ద్రావణాలు పిచికారీ చేసేందుకు సంబంధిత పరికరాల ధరలూ రూ.వేలల్లో ఉంటున్నాయి. గతంలో వీటన్నింటికీ ప్రభుత్వం రాయితీ అందించి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేది. మూడేళ్లుగా వాటిని అందించడం లేదు.
రుణమే శరణ్యం..
ఏ పంట వేయాలన్నా రైతులకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. దుక్కులు, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలు, కలుపుతీత, బిందుసేద్యం పరికరాలకు మదుపు పెట్టాల్సిందే. గతేడాది అధిక వర్షాలు, ఇతర కారణాలతో పంటలు దెబ్బతినడంతో ఎక్కువ మంది రైతులు ఆర్థికంగా చితికిపోయారు. రాయితీ వస్తుందన్న ధీమాతో వడ్డీకి తెచ్చి పెట్టుబడులు పెట్టారు. ఆలస్యమైతే వడ్డీల భారం పడనుందంటున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదించాం
- సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, పార్వతీపురం
జిల్లాలో సాగవుతున్న ఉద్యాన పంటల వారీగా ఏటా రాయితీ నిధులకు ప్రతిపాదనలు చేస్తున్నాం. నిధులు వస్తే రైతుల ఖాతాలకు జమ చేస్తాం. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగ్గురి పాలిట మృత్యువు
[ 29-03-2024]
మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది.. -
ఇదేం బాదుడు
[ 29-03-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వైష్ణపు వీధిలో 998 చ.అ. ఓ నివాస భవనం (జీ+1) ఏఆర్వీ (వార్షిక అద్దె విలువ విధానం) అమల్లో ఉన్నప్పుడు 2020-21లో ఏడాదికి ఆస్తి పన్ను రూ.3792 ఉండేది. -
వేరే దారి లేక.. డోలీ మోత
[ 29-03-2024]
సరైన రోడ్లు లేకపోతే మనం అడుగు తీసి అడుగు బయట పెట్టలేం. అలాంటిది ఆ గిరిజన గ్రామంలో అసలు దారే లేదు. అలాంటి చోట ఏదైనా ప్రమాదం జరిగితే, ఆసుపత్రి దగ్గరలో లేకపోతే ఇక అంతే సంగతి. -
రోడ్లు లేవు.. సేవలూ కానరావు
[ 29-03-2024]
రైతులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీలు ఆదాయ వనరుగానే మిగిలాయి. చెక్పోస్టుల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతున్నా కనీస సేవలు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది. -
నిండు గర్భిణులకు ‘నడక’ యాతన
[ 29-03-2024]
కొమరాడ మండలంలోని కొండ శిఖర గ్రామం గుమడంగి. ఇక్కడికి ఎలాంటి రోడ్డు సౌకర్యమూ లేదు. గిరిజనులు ఆరు కిలోమీటర్లు నడిస్తే ఒడిశా రాష్ట్రంలోని వంటామాడకి, 17 కి.మీ వెళ్తే ఆంధ్రాలోని కుంతేసు చేరుకుంటారు. -
మీ ఓటు పదిలమేనా..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రతిసారి ఓటు వేస్తున్నాం ఈ సారి పోలింగ్ రోజున వినియోగించుకుంటామని ధీమాగా ఉంటే పొరబడినట్టే. -
సహకారం కరవు
[ 29-03-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్లు) నిస్తేజమవుతున్నాయి. లావాదేవీలు లేకపోవడంతో కొన్నేళ్లుగా సేవలు నిలిచిపోయాయి. -
అక్కడ సమస్యలనే చదవాలి!!
[ 29-03-2024]
వేలాది పుస్తకాలు.. పాఠకులకు పూర్తిస్థాయిలో వసతులు.. విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు సేదదీరేందుకు గదులు.. మరుగుదొడ్లు.. నచ్చిన పుస్తకాలు, పత్రికలు.. -
పరిశ్రమలు రావాలంటే.. చంద్రబాబు సీఎం కావాలి
[ 29-03-2024]
కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. -
వాన కాదు.. వల్లకాడుకు దారి లేదు
[ 29-03-2024]
గజపతినగరంలో రైల్వే మూడో లైను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో స్థానిక రాళ్ల చెరువుకు సంబంధించిన కల్వర్టును రైల్వే అధికారులు పొరపాటున కప్పేయడంతో సమీపంలోని రైల్వే కాలనీ వాసులు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు.