అంబరాన్నంటిన.. అక్కాచెల్లెల్ల సంబరం
పార్వతీపురం ప్రజల ఆరాధ్యదైవాలు ఇప్పలపోలమ్మ, ఎర్రకంచెమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
పార్వతీపురం పురపాలక, గ్రామీణం, పట్టణం, న్యూస్టుడే: పార్వతీపురం ప్రజల ఆరాధ్యదైవాలు ఇప్పలపోలమ్మ, ఎర్రకంచెమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరలో రెండో రోజైన మంగళవారం ఉదయం నుంచి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులుదీరారు. జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా నుంచి తరలిరావడంతో సందడి నెలకొంది. అమ్మవార్ల ఘటాలను పట్టణంలో ఊరేగించి పూజలు చేశారు. రాత్రి సిరిమానోత్సవాలు కనులపండువగా జరిగాయి. శక్తి, బళ్ల, పులి వేషాలు, కాంతార, తీన్మార్, బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాయుడువీధిలో కొలువుదీరిన ఇప్పలపోలమ్మకు ఉత్సవ కమిటీ సభ్యులు పూజలు చేసిన అనంతరం రాత్రి 7.30 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభించారు. మానుపై అమ్మవారి వేషధారణలో పూజారి కొండెంశెట్టి రమణ ఆశీనులయ్యారు. సంప్రదాయం మేరకు ఆరిక కుటుంబానికి చెందిన రాజారావు అమ్మవారిని దర్శించుకుని రథాన్ని అధిరోహించారు. రెడ్డి వీధి నుంచి ప్రారంభమైన ఉత్సవం పోలీసుస్టేషన్, ప్రధాన రహదారికి చేరుకున్న తర్వాత ఘటాలను రాజుగారి కోటలోకి తీసుకెళ్లి పూజలు చేశారు. అక్కడి నుంచి దంగడి, పండా, తెలుకల వీధుల మీదుగా ఉత్సవం ముందుకు సాగింది. ఇప్పలపోలమ్మ చెల్లి, జగన్నాథపురం గ్రామదేవత ఎర్రకంచెమ్మ సిరిమానోత్సవం రాత్రి 8.10 గంటలకు పూజారి నక్క శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు కొత్తవీధి, రాయగడ రోడ్డు, పాతబస్టాండు, ప్రధాన రహదారి వరకు చేరుకుంది. అనంతరం రాజుగారి కోటలో ఘటాలకు పూజలు చేసిన తర్వాత పోలీసుస్టేషన్ వీధి మీదుగా జగన్నాథపురం ఆలయానికి చేరుకుంది.
ఇప్పల పోలమ్మ
బంగారమ్మ ఘటాల ఊరేగింపు
ఎర్రకంచెమ్మ సిరిమానోత్సవం
పట్టణ సమీపంలోని వైకేఎంనగర్లో మంగళవారం బంగారమ్మ ఘటాల ఊరేగింపు జరిగింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సాగింది. వీధుల్లో చీరలు పరచి ఘటధారులను భక్తులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కోలాటాలు, తప్పెటగుళ్ల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కమిటీ ప్రతినిధులు చంద్రమౌళి, సూర్యప్రకాశ్, సూర్యనారాయణ, జానకమ్మ పర్యవేక్షించారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?