పదహారోసారి.. పిలుపు
సాలూరు పట్టణంలోని 14వ వార్డు బంగారమ్మకాలనీలో గత మూడేళ్లుగా ఈ నీటి పథకం వినియోగంలో లేదు. కొత్త బోరు వేసి పథకం అభివృద్ధి పనులు చేసేందుకు పురపాలక సాధారణ నిధులు రూ.1.31 లక్షలు మంజూరు చేశారు.
టెండరు వేయించే బాధ్యత కౌన్సిలర్లదే
సమావేశంలో ప్రకటించిన అధికారులు
సాలూరు పట్టణంలోని 14వ వార్డు బంగారమ్మకాలనీలో గత మూడేళ్లుగా ఈ నీటి పథకం వినియోగంలో లేదు. కొత్త బోరు వేసి పథకం అభివృద్ధి పనులు చేసేందుకు పురపాలక సాధారణ నిధులు రూ.1.31 లక్షలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 15 సార్లు టెండర్లు పిలిచారు. ఎవరూ ముందుకు రాలేదు. ఈసారైనా గుత్తేదారులు స్పందించి, పనులు జరిగితే ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయి.
సాలూరు, న్యూస్టుడే: ‘అభివృద్ధి పనులు చేయండి. బిల్లులు ఇప్పించే బాధ్యత మాది’ అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చినా గుత్తేదారులు ముందుకు రావడం లేదు. పదిరోజుల కిందట సాలూరు పట్టణంలో 97 అభివృద్ధి పనులకు టెండర్లు పిలవగా ఒక్కదానికే దాఖలైంది. ఈక్రమంలో ‘ఎన్నికల సమీపిస్తుండటంతో ఎంతోకొంత అభివృద్ధి చేయాలి. లేదంటే పట్టణ ప్రజలకు ముఖం చూపలేం, పనులు జరిపించండి’ అని కౌన్సిల్ సభ్యులు ఉపముఖ్యమంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో చివరకు వార్డులలో పనులు చేయించుకునే బాధ్యతలను పాలకవర్గ సభ్యులకు అప్పగించారు. ఈ విషయాన్ని బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ శంకరరావు ప్రకటించారు. వార్డుల వారీగా ప్రతిపాదించిన పనులు, టెండర్ల వివరాలతో కూడిన ప్రతులను సభ్యులకు అందజేశారు. వార్డుల్లో చేపట్టే పనులకు కాంట్రాక్టర్లతో టెండర్లు వేయించుకునే బాధ్యత సభ్యులదేనని చెప్పారు. ఆర్థిక సంఘ నిధులతో ప్రతిపాదించినవి కాకుండా.. గడప గడపకు కార్యక్రమం కింద మంజూరై నిధులతో జరిగేలా గుత్తేదారులను కోరాలన్నారు.
మోక్షమేదీ..?
పురపాలికలో ప్రతిపాదించిన పనులకు ఇప్పటికే 15 సార్లు టెండర్లు పిలిచారు. అయినప్పటికీ మోక్షం కలగలేదు. ఈక్రమంలో రూ.2.59 కోట్లతో ప్రతిపాదించిన 96 పనులు చేపట్టాలని అధికారులు మరోసారి ప్రకటన జారీ చేశారు. 25 పనులకు సంబంధించి 16వ సారి, 22- 9వసారి, తొమ్మిదింటికి- 8వసారి, 19- ఆరోసారి, 15- మూడోసారి, 5 పనులకు రెండోసారి, ఒకటోసారి ఒకపనికి టెండర్లు పిలిచారు. వీటిలో గడప గడపకీ పనులు పూర్తిస్థాయిలో జరిపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితి. కాంట్రాక్టర్లతో టెండర్లు వేయిస్తారా.. లేదంటే మరో సారీ.. చెప్తారా వేచి చూడాల్సి ఉంది.
బాబ్బాబు.. ముందుకు రండి..
ఒకప్పుడు పనుల కోసం గుత్తేదారులు ఛైర్పర్సన్, కౌన్సిల్ సభ్యుల వెంట పడేవారు. కానీ, పరిస్థితి మారింది. వైకాపా అధికారంలోకి వచ్చాక.. సకాలంలో బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి కానరావడం లేదు. వార్డుల్లో తలెత్తుకు తిరగలేక పోతున్నామని సభ్యులు పలుమార్లు పురపాలక సమావేశాల్లో తమ గోడు వినిపించారు. అయినప్పటికీ మోక్షం కలగలేదు. మంత్రులకు ఆలపించారు. అయినా అమాత్యుల మాటలను గుత్తేదారులు బేఖాతరు చేశారు. చేసేదేమీ లేక చివరకు కౌన్సిలర్లకే పనులు జరిపించుకునే బాధ్యత అప్పగించారు. నాడు పనులు బాగా చేయలేదు, ఈగుత్తేదారుకు టెండరు ఖరారు చేయొద్దు అని చెప్పిన కౌన్సిలర్లే.. నేడు ‘అయ్యా బాబూ రండి మా వార్డులో పనులకు టెండరు వేయండంటూ’ బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది. బడానేతలు, అధికారులకు చెప్పినా పనిజరగలేదు. కనీసం మీరు మామీద నమ్మకం ఉంచి పనులు చేసేందుకు ముందుకు రండని పిలుస్తున్నారు.
మళ్లీ పిలిచాం..
- శంకరరావు, కమిషనర్, సాలూరు పురపాలక సంస్థ
97 అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచాం. ఒకదానికి సంబంధించి దాఖలయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిగిలిన 96 పనులకు మరోసారి పిలిచాం. ఈనెల మూడోతేదీ మధ్యాహ్నం మూడు గంటలలోగా పత్రాలు దాఖలు చేయడానికి గడువిచ్చాం. ఈసారి అన్ని పనుల్లో కదలిక వస్తుందని భావిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్కు తరలివెళ్లిన తెదేపా తమ్ముళ్లు
[ 25-04-2024]
తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర గురువారం నామినేషన్కు వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బలిజిపేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్లు పార్వతీపురం జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. -
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్