మళ్లీ పెంచేశారు
ప్రభుత్వం భూముల విలువ పెంపునకు ఆమోదం తెలిపింది. దీనిని జూన్ ఒకటి నుంచి అమలు చేయనుంది. కొత్త ధరలను స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ కంప్యూటర్లలో బుధవారమే నమోదు చేయాలని ఆదేశించింది.
నేటి నుంచి భూముల విలువ పెంపు
ఈనాడు-విజయనగరం, పార్వతీపురం, న్యూస్టుడే: ప్రభుత్వం భూముల విలువ పెంపునకు ఆమోదం తెలిపింది. దీనిని జూన్ ఒకటి నుంచి అమలు చేయనుంది. కొత్త ధరలను స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ కంప్యూటర్లలో బుధవారమే నమోదు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు జిల్లా అధికారుల ఆదేశాలతో ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది ఏఏ సర్వే నంబర్లలో పెంచింది నమోదు చేశారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని ప్రధాన, రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కనున్న భూముల విలువను 40 నుంచి 60 శాతం వరకు పెంచారు. 2013లో శాస్త్రీయంగా భూముల ధరల విలువపై రివిజన్ జరిగింది. తర్వాత మధ్యమధ్యలో పెంచుతూ వచ్చింది. గతంలో ప్రభుత్వ ప్రాజెక్టులకు, రహదారుల నిర్మాణానికి సేకరించిన భూముల పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు పెంచలేదు. ఈసారి వాటిపై కూడా దృష్టి సారించింది.
భోగాపురం పరిసరాల్లో..
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలోని భూములకు గిరాకీ ఉంటుందని భావించింది. పూసపాటిరేగ మండలంలో నాలుగు, డెంకాడలో అయిదు, భోగాపురం మండలంలో 10 గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. విమానాశ్రయ నిర్మాణ ప్రాంతం చుట్టూ ఉన్న ఎ.రావివలస, సవరవిల్లి, రావాడ, రాజాపులోవ, పోలిపల్లి, గూడెపువలస, కంచేరు, కౌలువాడ పరిధిలో చ.గ రూ.4 వేల నుంచి రూ.5 వేలకు, ఇతర ప్రాంతాల్లో రూ.3 నుంచి రూ.4 వేలకు పెంచారు. పార్వతీపురం సబ్ రిజిస్ట్రారు పరిధిలో పట్టణంలో, పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం మండలాల్లోని గ్రామాల్లో సవరించే ప్రతిపాదనలు రూపొందించారు. పట్టణంలోని బైపాస్ కాలనీ, సౌందర్య థియేటర్ ప్రాంతం, రౌతువీధి, ఎన్ఎన్ఎం లేఅవుట్, ప్రధాన రహదారికి తూర్పు వైపు, రామానంద్నగర్, కేఎంహెచ్ ప్రాంతం, గూడ్సు షెడ్ రోడ్డు ప్రాంతంలో ఇళ్ల స్థలాల విలువ 30 శాతం వరకు, చర్చి వీధిలో 50 శాతం పెంచేలా ప్రతిపాదించారు. వ్యాపార లావాదేవీలు నిత్యం జరుగుతున్న ప్రాంతాల్లోనే పెంపునకు ప్రతిపాదనలు రూపొందించినట్లు జిల్లా రిజిస్ట్రారు పూర్ణచంద్ చెప్పారు.
* కొత్తవలస మేజర్ పంచాయతీలో గొల్లపేట ఎస్సీ కాలనీ, రామకోవెల, కాపువీధి, ఎరుకులపేట, ప్రాంతాల్లో గజం రూ.5 వేల నుంచి రూ.7 వేలకు పెరిగింది.
* చింతలపాలెం, అర్ధన్నపాలెం, బలిఘట్టం, రెల్లి, తుమ్మికాపల్లి, ఉత్తరాపల్లి, లక్కవరపుకోట సహా 19 ప్రాంతాల్లో కనిష్ఠంగా 33, గరిష్ఠంగా 50 శాతం పెంచారు.
* విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో 10 నుంచి 15 శాతం, దుక్కవాని వీధి పరిధిలో రూ.5 నుంచి రూ.6 వేలు, శ్రీనివాస జూనియర్ కళాశాల రహదారి ప్రాంతంలో రూ.15 వేల నుంచి రూ.18 వేలు అయింది.
* విజయనగరం పశ్చిమ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో 59 గ్రామాలకు గాను 18 గ్రామాల్లో 20 శాతం వరకు పెంచారు.
* చీపురుపల్లి పరిధిలో 74 గ్రామాలకు గానూ 21 గ్రామాల్లో 30 నుంచి 56 శాతం అయింది.
* నెల్లిమర్ల పరిధిలో 73 గ్రామాలకు గానూ 15 గ్రామాల్లో 30 నుంచి 60 శాతం భూముల ధరలు పెరిగాయి. నెల్లిమర్ల, కెరటాం, ఎస్.ఎస్.ఆర్.పేట ప్రాంతాల్లో చదరపు గజం రూ.1800 నుంచి రూ.3 వేలు, రూ.3200 నుంచి రూ.4500 వరకు అయింది. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తామని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ విజయలక్ష్మి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్