నేటి నుంచి ఇంటర్మీడియట్ కళాశాల పున:ప్రారంభం
ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి ఇంటర్మీడియట్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలతో పాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి.
విజయనగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసంపూర్తిగా నాడు-నేడు పనులు
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి ఇంటర్మీడియట్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలతో పాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి. గత విద్యా సంవత్సరంలో చాలామంది పరీక్ష తప్పారు. ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు.
అనుకూలం
* మే 15 నుంచే ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించారు. అధ్యాపకులు మార్చి, ఏప్రిల్లో పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పించడంతో చాలామంది ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు.
* విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఒప్పంద, అతిథి బోధకులను కొనసాగించేందుకు ఆదేశాలొచ్చాయి. అయితే బదిలీలతో అవరోధం కలగనుంది. అధ్యాపకులకు సంబంధించి జూన్ 2 నుంచి స్థానచలనం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇతర జిల్లాల్లో పనిచేసేవారు ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన ఖాళీల మేరకే అతిథి బోధకులను కొనసాగించనున్నారు.
* విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 32 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో 446 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరిలో 125 మందే రెగ్యులర్. మిగిలిన వారంతా ఒప్పంద, అతిథి బోధకులే.
ప్రతికూలం
* గత రెండేళ్లుగా పాఠ్యపుస్తకాలు సరఫరా చేయలేదు. 2023-24 విద్యాసంవత్సరానికి 43,007 పుస్తకాలు కావాలని ప్రతిపాదించినా నేటికీ రాలేదు. మొదటి సంవత్సరం 22,428, ద్వితీయ ఏడాది వారికి 20,579 పంపిణీ చేయాల్సి ఉంది. గతేడాది అంతకుముందు సంవత్సరాల్లో మిగిలిన వాటిని సర్దుబాటు చేశారు. ఈ ఏడాది ఏం చేయాలో తెలియక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
* అమ్మఒడి పథకంతో కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయింది. గ్రామీణ విద్యార్థులు కావడంతో పథకం నిర్వహించాలన్న డిమాండు ఉన్నా ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
* కొన్ని కళాశాలల్లోనే ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. అన్నిచోట్లా తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో ప్రవేశాలు కల్పించాలని ఆదేశాలున్నాయి.
* నాడు-నేడు పనుల్లో జాప్యం జరుగుతోంది. మన్యం జిల్లాలో కొంత ప్రగతి కనిపిస్తున్నా, విజయనగరం జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. 17 కళాశాలలకు రూ.11.81 కోట్లు మంజూరు కాగా.. రెండు విడతలుగా రూ.2.98 కోట్లు విడుదలయ్యాయి. రూ.1.80 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 40 శాతం పనులు పూర్తయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సిమెంటు కొరత, ఇతర సామగ్రి రాకపోవడంతో ప్రగతి కొరవడుతోంది.
అడకమిక్పై ప్రత్యేక దృష్టి..: విద్యా సంవత్సరం ఆరంభం నుంచే అకడమిక్పై ప్రత్యేక దృష్టి పెడతాం. కరోనా బ్యాచ్లు లేకపోవడంతో ఫలితాలు మెరుగుపడతాయని భావిస్తున్నాం. విద్యార్థులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో దేనిలోనైనా ప్రవేశాలు పొందవచ్చు. పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. సిమెంటు వస్తే నాడు-నేడు పనులు పూర్తవుతాయి.
ఆర్.సురేష్కుమార్, డి.మంజులవీణ, వృత్తి విద్యాశాఖాధికారులు, ఉమ్మడి జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను ఉన్నానన్నావ్.. విన్నానన్నావ్.. ఐదేళ్లుగా ఏం చేశావ్!
[ 23-04-2024]
‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో నమ్మించారు జగన్. ఆ మాటలు ఉమ్మడి జిల్లా ప్రజలు నిజమే అనుకున్నారు. ఇక తమ కష్టాలు తీరినట్లేనని ఓట్లు వేసి గద్దెనెక్కించారు. -
ఎంపీ అభ్యర్థినిగా కొత్తపల్లి గీత నామినేషన్
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు పార్లమెంటరీ స్థానానికి ఐదు, కురుపాం శాసనసభకు రెండు, పార్వతీపురం, పాలకొండ శాసనసభలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. -
వేదనలోనూ విజయం
[ 23-04-2024]
పరీక్ష రోజే తండ్రి మృతి చెందినా ఆయన ఆశయాన్ని కుమారుడు నిలబెట్టాడు. సరిగ్గా నెల రోజుల క్రితం మార్చి 22న పదో తరగతి గణితం పరీక్ష జరిగింది. ఆ రోజు ఉదయాన్నే లేచి హడావుడిగా సిద్ధమవుతున్న ఆ విద్యార్థికి తన తండ్రి మృతి చెందిన వార్త తెలిసి తల్లడిల్లిపోయాడు. -
ఎస్.కోటను అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
ప్రశాంతమైన విశాఖ నగరానికి తాము ఐటీ కంపెనీలు తీసుకొస్తే జగన్ భూ బకాసురులను దించి కబ్జాలతో కబళించాడని, రాక్షస మూకలను దించి అశాంతి నగరంగా మార్చేశాడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. -
పదిలో అయిదో స్థానం
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా అయిదో స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. -
వైకాపా పతనం తప్పదు: కళా
[ 23-04-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాకు పతనం తప్పదని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు తెలిపారు. -
పార్లమెంటుకు 05 .. అసెంబ్లీకి 24
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి 05, అసెంబ్లీ స్థానాలకు 24 వచ్చాయి. ఎంపీ స్థానానికి వైకాపా అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ రెండు సెట్ల నామపత్రాలు అందజేశారు. -
కోటలో జనసంద్రం
[ 23-04-2024]
శృంగవరపుకోటలో చంద్రబాబు పాల్గొన్న ప్రజాగళం సభకు ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. జగ్గంపేట సభ అనంతరం వచ్చిన చంద్రబాబుకు హెలీప్యాడ్ వద్ద అభ్యర్థులు శ్రీభరత్, కోళ్ల లలితకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, కార్యదర్శి ఐ.సుధారాజు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ వబ్బిన సత్యనారాయణ, భాజపా నియోజకవర్గ కన్వీనర్ జగదీశ్వరి స్వాగతం పలికారు. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలు
[ 23-04-2024]
అరకు పార్లమెంటరీ.. -
నాలుగు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
[ 23-04-2024]
కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు అసెంబ్లీ, విజయనగరం పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నెల్లిమర్ల నియోజకవర్గం అభ్యర్థిగా సరగడ రమేష్కుమార్ (పార్టీ జిల్లా అధ్యక్షుడు), గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థిగా విజయనగరానికి చెందిన డోల శ్రీనివాసరావు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. -
ప్రకటనల మోత.. ఏదీ రైలుబస్సు కూత
[ 23-04-2024]
మారుమూల ప్రాంతంలో సౌకర్యంగా ఉన్న రైలుబస్సు సేవలకు గ్రహణం పట్టింది. ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే సాలూరు రైల్వే స్టేషన్లో రైలు కూత వినిపించకుండా పోయింది. -
ట్రాఫిక్ నియంత్రణ కత్తిమీద సామే
[ 23-04-2024]
నగరం సమీపంలోని చెల్లూరు కూడలిలో మంగళవారం జరిగే సిద్ధం సభ నిర్వహణపై పోలీసులు, అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలకు అతిప్రధానమైన రెండు జాతీయ రహదారులకు ఆనుకుని వేదిక ఏర్పాటు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
జగన్ చెప్పారంటే.. చేయరంతే!
[ 23-04-2024]
ప్రతి ఒక్కరి గుండెచప్పుడు విన్నా.. ప్రజల కన్నీళ్లను చూశా.. సమస్యలన్నీ తీరుస్తా.. అని పాదయాత్రలో హామీల వర్షం కురిపించిన సీఎం జగన్ గద్దె ఎక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. -
పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. బొబ్బిలి గురుకుల పాఠశాల విద్యార్థులు కె.వరుణ్ 600కు 592, ఎం.హర్షవర్థన్ 592, కె.రాకేష్ 590 మార్కులు సాధించారు. -
‘ప్రజల్ని దోచేసిన వైకాపా’
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజల కష్టాన్ని అధిక ధరలు, ఛార్జీల రూపంలో దోచేసిందని కూటమి చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. గరివిడి మండలం కోడూరు, ఏనుగువలస గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్