డబ్బులు ఊరికే రావు.. ఇవీ అడగండి బాబూ..
పెట్రోల్ కొట్టించేందుకు వెళ్తే రూ.110కిపైగా తీయాల్సిందే. డీజిల్ వేయిస్తే రూ.100 నోటు ఇచ్చేయాల్సిందే. కేవలం ఇంధనం కోసమే ఇంత ధర కాదండోయ్.. వినియోగదారులకు మరికొన్ని సదుపాయాలూ ఉన్నాయండోయ్..
న్యూస్టుడే, విజయనగరం నేరవార్తా విభాగం
పెట్రోల్ కొట్టించేందుకు వెళ్తే రూ.110కిపైగా తీయాల్సిందే. డీజిల్ వేయిస్తే రూ.100 నోటు ఇచ్చేయాల్సిందే. కేవలం ఇంధనం కోసమే ఇంత ధర కాదండోయ్.. వినియోగదారులకు మరికొన్ని సదుపాయాలూ ఉన్నాయండోయ్.. బంకుల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా గాలి కొట్టడం, తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యత పరిశీలన.. తదితర సదుపాయాలు కల్పించాలి. ఇవేవీ లేకపోతే సంబంధిత వ్యక్తులపై తూనికలు- కొలతల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. మరి మీరివి సద్వినియోగం చేసుకుంటున్నారా? ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా..
ఉమ్మడి జిల్లా పరిధిలో 134 పెట్రోల్ బంకులున్నాయి. వీటిల్లో చాలాచోట్ల సౌకర్యాలు కానరావడం లేదు. మరుగుదొడ్లు ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నా.. అవి కేవలం అక్కడ పనిచేసే సిబ్బందికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అలాగే తాగేందుకు నీరు ఉన్నట్లు ఖాళీ క్యాన్లు ఉంచుతున్నారు. గాలి ఉచితమని బోర్డులున్నా.. కొట్టేందుకు మనిషి కనిపించడు. తూకం పరికరం, పెట్రోల్ తెలుసుకునేందుకు నాణ్యత పేపర్ల ఊసే లేదు. ఈక్రమంలో వినియోగదారులు నష్టపోతున్నారు.
పాటించకపోతే చర్యలు..
వినియోగదారులకు సౌకర్యాలు కల్పించకపోతే తూనికలు- కొలతల శాఖ అధికారులు నేరుగా రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటారు. ఇటీవల అన్ని బంకులనూ పరిశీలించి, దాదాపు 25 కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు. 2020-21లో 260 సార్లు, 2021-22లో 247, 2022- 23లో 399 సార్లు తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. ఏడాదికి ఒక్కో బంకునూ దాదాపు 5 నుంచి 10 సార్ల వరకు పరిశీలిస్తున్నామని తూనికలు- కొలతల శాఖ మూడు జిల్లాల సహాయ సంచాలకుడు జనార్దనరావు తెలిపారు.
బోర్డులు తప్పనిసరి..
ఏ సౌకర్యం ఎక్కడ ఉందో తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలి. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అత్యవసర సేవల కోసం పట్టికలు పెట్టాలి. వాటి మీద ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు రాయాలి. ప్రతిజిల్లాలో ఆయిల్ కార్పొరేషన్ తరఫున ఒక అధికారి ఉంటారు. సదుపాయాలు కానరాకపోతే ఆయనకు తెలియజేయొచ్చు. స్పందించకపోతే జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. తూకంలో తేడా ఉంటే తూనికలు- కొలతలశాఖ అధికారులకు, నాణ్యత లోపించినా, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు లేకపోతే పౌర సరఫరాలశాఖ సిబ్బందికి విన్నవించొచ్చని డీఎస్వో మధుసూదనరావు తెలిపారు. తమశాఖ తరఫున అప్రమత్తంగా ఉన్నామన్నారు.
నిబంధనలివీ..
* ప్రతి బంకు వద్ద ఉచితంగా గాలి కొట్టే సౌకర్యం కల్పించడంతో పాటు ఒక మనిషిని అందుబాటులో ఉంచాలి. డబ్బులు డిమాండ్ చేయరాదు.
* వినియోగదారులకు కనిపించేలా తాగేందుకు నీళ్లు ఉంచాలి.
* కొలతల్లో తేడాలను చూసుకునేందుకు తప్పనిసరిగా కొలత క్యాన్లను పెట్టాలి.
* నాణ్యత తెలుసుకునేందుకు లిట్మస్ పేపర్ ఉంచాలి. దాని మీద ఒక చుక్క ఆయిల్ పోశాక అది రంగు మారితే సరైన ఇంధనం కానట్లే.
* అందుబాటులో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. వాటిని శుభ్రంగా ఉంచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీ పరిశ్రమకు సర్కారీ దెబ్బ
[ 18-04-2024]
రాష్ట్రంలో.. ఉమ్మడి జిల్లాలో కీలకమైన లారీ పరిశ్రమ సాలూరులో ఉంది. గతంలో వేలాది మందికి జీవనాధారం. లోడింగ్ అన్లోడింగ్లతో కార్మికులు, యాజమానులు ఎంతో బిజీగా గడిపేవారు. -
తాగునీరో జగనన్న!!
[ 18-04-2024]
వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రజలు తాగునీటికీ కష్టాలు పడ్డారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నేటికీ ఆ ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కనీసం అందుబాటులో ఉన్న పథకాలనూ సద్వినియోగం చేసుకోని ఈ సర్కారు గతంలో నిర్మించిన వాటినీ మూలకు తోసేసింది. -
నామపత్రం.. నేడే ఆరంభం
[ 18-04-2024]
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ స్థానాలు, విజయనగరం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. తొలి రోజు నెల్లిమర్ల వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. -
అయిదేళ్లు.. పరిశ్రమలు కుదేలు!
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లా జనపనార పరిశ్రమలకు ప్రసిద్ధి. గోగుసాగు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో ముడిసరకు కొరత లేకపోవడంతో పరిశ్రమలను స్థాపించారు. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం, నెలిమర్ల, కొత్తవలసలో జనపనార పరిశ్రమలు ఉన్నాయి. -
వైభవం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రెండో భద్రాదిగా విరాజిల్లుతున్న రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముని కల్యాణం వైభవంగా జరిగింది. తిరుపతి, సింహాచలం దేవస్థానాల నుంచి వచ్చిన పట్టువస్త్రాలు, -
తెదేపాలో వైకాపా కార్యకర్తల చేరిక
[ 18-04-2024]
చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వైకాపాకు చెందిన 13వ వార్డు సభ్యురాలు మీసాల కామేశ్వరి, శ్రీనివాసరావు దంపతులు, మాజీ వార్డు సభ్యుడు రెడ్డి త్రినాథ, ఆ పార్టీ సీనియర్ కార్యకర్తలు రెడ్డి అసిరినాయుడు, -
దేవస్థానం భూమినే కప్పేస్తున్నారు!!
[ 18-04-2024]
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి దేవస్థానం భూములు ఆక్రమణలకు గురవుతున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. జేఎన్టీయూ కూడలి సమీపంలోని రెండు రోడ్లకు మధ్యలో దేవస్థానానికి చెందిన స్థలం ఉంది. -
జనసేన అభ్యర్థిని నాగమాధవికి బి-ఫారం
[ 18-04-2024]
కూటమి అభ్యర్థినిగా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న లోకం నాగమాధవి జనసేన అధినేత పవన్కల్యాణ్ చేతులమీదుగా బి-ఫారం అందుకున్నారు. -
అప్పుడు రూ.250.. ఇప్పుడు రూ.10,000
[ 18-04-2024]
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ధరావత్తు చెల్లించాలి. శాసనభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ధరావత్తుగా రూ.10 వేలు ఎన్నికల సంఘానికి చెల్లించాలి. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం: శ్రీభరత్
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..