logo

హామీలిచ్చి.. వదిలేశారా

పురపాలక కార్మికులు, సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండు చేశారు.

Published : 02 Jun 2023 02:45 IST

విజయనగరం మయూరికూడలి, నెల్లిమర్ల, న్యూస్‌టుడే: పురపాలక కార్మికులు, సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండు చేశారు. ప్రచార జాత కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన ర్యాలీగా విజయనగరం చేరుకున్నారు. అధికారంలోకి రాకముందు జగన్‌మోహన్‌రెడ్డి అనేక హామీలిచ్చారని, ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా స్పందించడం లేదన్నారు. జిల్లాకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ఆయనకు వినతిపత్రం అందించారు. రి నెల్లిమర్లలో సీఐటీయూ ఆధ్వర్యంలో జీపుజాతా నిర్వహించారు. రాష్ట్ర నాయకులు జ్యోతిబసు, వరలక్ష్మి, నూకరాజు, వెంకటరమణ, గారలక్ష్మి, నాయుడు, జిల్లా అధ్యక్షుడు పి.శంకర్రావు, ఉపాధ్యక్షులు బి.సుధారాణి, మండల నాయకుడు కె.రామారావు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని