logo

లోకేశ్‌పై కోడిగుడ్ల దాడి పిరికి చర్య

లోకేశ్‌ యువగళం పాదయాత్రతో వైకాపా నేతల్లో వణుకు పుడుతోందని, కోడిగుడ్ల దాడితో పిరికి చర్యకు పాల్పడ్డారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

Published : 03 Jun 2023 03:25 IST

సాలూరు, న్యూస్‌టుడే: లోకేశ్‌ యువగళం పాదయాత్రతో వైకాపా నేతల్లో వణుకు పుడుతోందని, కోడిగుడ్ల దాడితో పిరికి చర్యకు పాల్పడ్డారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం ఆమె నివాసంలో నాయకులతో సమావేశమయ్యారు. వైకాపా నేతలు చిల్లర వేషాలు మానుకోవాలని, తెదేపా శ్రేణులు తిరగబడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అధికారం వైకాపాకు శాశ్వతం కాదని, తెదేపా అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతను తొలగిస్తే ఫినిష్‌ అని స్పీకర్‌ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. సీఎం సొంత జిల్లాలో వైకాపా కనుమరుగవుతుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేకపోతున్నారని, లోకేశ్‌ పాదయాత్రకు భద్రత పెంచాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కౌన్సిలర్లు లక్ష్మోజీ, హర్షవర్ధన్‌, యుగంధర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని