logo

సమష్టి కృషితో పురస్కారాలు

జిల్లాలో యంత్రాంగం సమష్టిగా పనిచేయడంతో ఏడాదిలో నాలుగు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు వరించాయని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు.

Published : 03 Jun 2023 04:42 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాలో యంత్రాంగం సమష్టిగా పనిచేయడంతో ఏడాదిలో నాలుగు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు వరించాయని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. ఈమేరకు గురువారం రాత్రి పార్వతీపురంలో జరిగిన అభినందన సభలో కలెక్టర్‌ను జిల్లా అధికారులు సత్కరించారు. ఇటీవల నీతి ఆయోగ్‌ నుంచి ప్రశంసలు, రూ.3 కోట్ల అదనపు నిధులు సమకూరాయి. దీంతో పాటు సీతానగరం మండలం జోగింపేట పంచాయతీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ పురస్కారం లభించింది. ఈ నేపథ్యంలో నిశాంత్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, జేసీ గోవిందరావు, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌, సబ్‌కలెక్టరు నూరుల్‌కమర్‌, డీఆర్వో వెంకటరావు, ఆర్డీవో హేమలత, డీఎఫ్‌వో ప్రసూన, ఏఎస్పీ దిలీప్‌ కిరణ్‌, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు కిరణ్‌కుమార్‌, రామచంద్రరావు, డీజీపీవో సత్యనారాయణ, పీఆర్‌ ఈఈ కృష్ణాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని