నిరాస్తకత ఎందుకో !
చేపల రిటైల్ అవుట్లెట్ విలువ రూ.3.25 లక్షలు. దీని నిర్వహణకు లబ్ధిదారుడు 10 శాతం వాటా అంటే రూ.32,500 భరిస్తే, మిగిలిన 90 శాతం బ్యాంకు రుణం సమకూర్చుతారు.
చేపల అవుట్లెట్ల ఏర్పాటుకు ముందుకు రాని మహిళా సంఘాలు
న్యూస్టుడే, బొబ్బిలి
ప్రభుత్వ అవుట్లెట్ల నమూనా...
యూనిట్ నిర్వహణ ఇలా..
చేపల రిటైల్ అవుట్లెట్ విలువ రూ.3.25 లక్షలు. దీని నిర్వహణకు లబ్ధిదారుడు 10 శాతం వాటా అంటే రూ.32,500 భరిస్తే, మిగిలిన 90 శాతం బ్యాంకు రుణం సమకూర్చుతారు. ఆ మొత్తంతో 30 రకాల పరికరాలను అందజేస్తారు. ఫిష్ డిస్ప్లే, యూనిట్ కవర్, లైవ్ఫిష్ ట్యాంకు, ఇన్వర్టర్, టేబుల్, తూనిక యంత్రం, టేబుల్, బిన్లు, కటింగు యంత్రాలు, స్ట్రక్చర్ తదితర వస్తువులు సమకూర్చుతారు. ఇవన్నీ సంఘ సభ్యులు వినియోగించుకోవాలి. నిర్ధేశిత ధరకు చేపలను సరఫరా చేస్తారు. వచ్చిన ఆదాయంలో నిర్వహణ ఛార్జీలు, బ్యాంకు రుణం చెల్లించాలి.
చేపల విక్రయం ద్వారా ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం సూచిస్తున్న అవుట్లెట్ల ఏర్పాటుకు ఉమ్మడి జిల్లాలో మహిళా సంఘాల నుంచి స్పందన కరవవుతోంది. ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మత్స్యశాఖ, మెప్మా అధికారులు సమన్వయంతో సంఘాలను సమన్వయ పరిచి వీటిని ఏర్పాటు చేయించాలన్న లక్ష్యం నీరుగారుతోంది.
మాకొద్దంటూ ససేమిరా..
ఉమ్మిడి జిల్లాలోని పురపాలికల్లో మొత్తం 15 వేల సంఘాల్లో 1.50 లక్షల మంది సభ్యులు ఉన్నారు. యూనిట్ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రుణాలు అందజేస్తామన్నా సంఘాల సభ్యులు నిర్వహణకు ఆసక్తి చూపడం లేదు. ఒక్కో పురపాలికలో కనీసం 10 మంది కూడా స్టాళ్ల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా కాలేదు. మెప్మా సిబ్బంది అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నా.. స్థల సమస్య కారణంగా చాలామంది వెనుకంజ వేస్తున్నారు.
లక్ష్యం ఇదీ..
* మహిళా సంఘాలకు మెరుగైన ఆదాయం సమకూర్చడం
* వ్యాపారపరంగా మరింత వృద్ధి సాధించడం
*ఎగుమతులు చేసే స్థాయికి చేర్చడం
* జీవనోపాధులు మెరుగుపర్చడం
* నాణ్యమైన చేపలు అందుబాటులోకి తేవడం.
వాస్తవ పరిస్థితులు ఇలా..
* చేపల విక్రయాలపై సభ్యులకు అవగాహన లేకపోవడం
* ఆ వ్యాపారంపై ఆసక్తి లేకపోవడం
* జాగ్రత్తలు తీసుకోకుంటే పూర్తిగా నష్టపోతామన్న భావన
* ప్రభుత్వ రుణాల్లో ఎలాంటి రాయితీలు లేకపోవడం
* పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో స్థలాలు లభ్యంకాకపోవడం
* సకాలంలో బ్యాంకు రుణం తీర్చలేమన్న సందేహం.
చైతన్యం కల్పిస్తున్నాం...: రిటైల్ అవుట్లెట్ల ప్రయోజనాలు సంఘాలకు తెలియజేస్తున్నాం. సభ్యులు సానుకూలంగా ఆలోచిస్తే లాభాలు వస్తాయి. ఆశించిన స్పందన లేకపోవడంతో అవగాహన కల్పిస్తున్నాం. సభ్యులు వ్యాపార ధోరణిలో ఆలోచించాలి. మత్స్యశాఖ తరఫున సమావేశాలు నిర్వహించి లాభాలు చెప్పాం.
సుధాకర్, మెప్మా జిల్లా పథక సంచాలకుడు,
సంతోష్, మత్స్యశాఖ ఇన్స్పెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లుంబూరు కాలనీలో సౌకర్యాలేవన్నా!
[ 28-03-2024]
ప్రభుత్వం ఆర్భాటంగా ఇళ్లు కాదు... ఊళ్లే నిర్మించేస్తామంటూ అట్టహాసంగా జగనన్న కాలనీలను మంజూరు చేసి నాలుగేళ్లవుతున్నా నేటికీ కనీస సదుపాయాలు కల్పించలేదు. స్థలాలిచ్చాం... మీరే కట్టుకోండంటూ లబ్ధిదారులను గాలికొదిలేసింది. -
అసంపూర్తి పనులు.. తప్పని అవస్థలు
[ 28-03-2024]
సీతానగరం మండల కేంద్రం నుంచి పలు గ్రామాలను అనుసంధానించేందుకు నిర్మించిన రహదారుల అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగలడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పదేళ్లుగా అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి ఈ ఏడాది నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. -
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
[ 28-03-2024]
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వసతులు
[ 28-03-2024]
పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ కేంద్రాల వద్ద అన్ని వసతులు పక్కాగా ఉండాలని కలెక్టరు నిశాంత్కుమార్ ఆదేశించారు. -
జలకలే
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో 2020-21లో జలకళ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు పది వేల దరఖాస్తులు వచ్చాయి. నాలుగేళ్లలో 373 బోర్లకు రూ.5.55 కోట్లతో పరిపాలనా అమోదం ఇచ్చారు. -
జనం జీవితాల్లో బూడిద
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలోని వేపాడ, ఎస్.కోట, ఎల్.కోట, బొండపల్లి, గురుగుబిల్లి, పాచిపెంట, పాలకొండ మండలాల్లో కొండలను పిండి చేస్తున్నారు. అనుమతులు కన్నా అదనపు విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి జేబులు నింపుకొంటున్నారు. -
బిల్లులు రాక.. నిర్మాణాలు సాగక
[ 28-03-2024]
-
ఔత్సాహికం.. అల్లంతదూరం
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనే మాట వినిపించడం లేదు. వారికి అందించాల్సిన శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులు దూరమయ్యాయి. దీంతో నిరుద్యోగ సమస్య రానురానూ తీవ్రమవుతోంది. -
ఆపద్బాంధవులకూ కష్టాలే!!
[ 28-03-2024]
అగ్ని ప్రమాదం సంభవిస్తే ఠక్కున గుర్తొచ్చేది అగ్నిమాపక దళమే. భారీ యంత్రాలు, బరువైన పరికరాలతో ఎంత పెద్ద భవనాలనైనా ఎక్కి మంటలను అదుపు చేసేందుకు మృత్యువుతో పోరాడుతారు. మరి ఆ విభాగానికే కష్టమొస్తే.. అలాంటి పరిస్థితే జిల్లాలో నెలకొంది. -
వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు
[ 28-03-2024]
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి రాజాం నియోజకవర్గ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. -
అనుమానంతోనే భార్యను చంపేశాడు
[ 28-03-2024]
ఆమె వృద్ధురాలు.. వయసు 60 ఏళ్లు.. కానీ తాగిన మైకంలో భర్త అనుమానించేవాడు. నిరంతరం వేధించేవాడు. చివరకు హత్య చేసి, దారుణానికి ఒడిగట్టాడు. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురంలో ఇటీవల జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. -
ఇంటర్ మూల్యాంకనం 50 శాతం పూర్తి
[ 28-03-2024]
కొత్తగా ఏర్పడిన జిల్లాలో తొలిసారిగా ఇంటర్మీడియట్ మూల్యాంకనం నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 50 శాతం దాటి జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు క్యాంపు అధికారి ఎస్.తవిటినాయుడు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే