logo

క్వీన్స్‌ గెలిచారు.. రాయల్స్‌ ఓడారు

విజయనగరంలోని పీవీజీ.రాజు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో జరుగుతున్న ఏపీ టీ- 20 లీగ్‌ ఉత్సాహంగా సాగుతోంది.

Published : 06 Jun 2023 03:04 IST

బ్యాటింగ్‌ చేస్తున్నరాయలసీమ క్వీన్స్‌ క్రీడాకారిణి

విజయనగరం క్రీడలు, న్యూస్‌టుడే: విజయనగరంలోని పీవీజీ.రాజు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో జరుగుతున్న ఏపీ టీ- 20 లీగ్‌ ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజు ఉదయం విజయనగరం రాయల్స్‌, రాయలసీమ క్వీన్స్‌ తలపడ్డాయి. టాస్‌ గెలిచిన క్వీన్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. బ్యాటింగ్‌కు దిగిన విజయనగరం జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన రాయలసీమ క్రీడాకారిణులు 5 వికెట్లు కోల్పోయి 17 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. బీ మధ్యాహ్నం జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన వైజాగ్‌ డాల్ఫిన్స్‌ 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఛేదనలో ఏడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేసిన బెజవాడ బ్లేజర్స్‌ ఓటమి చవిచూసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని