భూ సమస్యలే అధికం
కలెక్టరేట్లో జరిగిన జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ నిశాంత్కుమార్, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్, డీఆర్వో వెంకటరావు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టరు నిశాంత్కుమార్, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్, డీఆర్వో వెంకటరావు
పార్వతీపురం, న్యూస్టుడే: కలెక్టరేట్లో జరిగిన జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ నిశాంత్కుమార్, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్, డీఆర్వో వెంకటరావు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 72 రాగా, వీటిలో ఎక్కువగా భూ సంబంధిత ఫిర్యాదులే ఉన్నాయని అధికారులు తెలిపారు. జిరాయితీ భూములు దేవాలయాల జాబితాలో చేరడం, ప్రభుత్వ భూములుగా నమోదు కావడం లాంటి సమస్యలతో సర్వే సమయంలో అవస్థలు పడుతున్నామని పలువురు వాపోయారు. వీటిని పరిష్కరించాలని సంబంధిత తహసీల్దార్లకు అధికారులు ఆదేశించారు.
గుక్కెడు నీరివ్వండి..: కలెక్టరేట్ ప్రాంగణం: గుక్కెడు నీరు లేక అల్లాడి పోతున్నామంటూ మక్కువ మండలం లోవరఖండి గ్రామస్థులు కలెక్టరేట్ వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామంలో బోర్ల నుంచి బురద వస్తుండడంతో గెడ్డ నుంచి తెచ్చుకుంటున్నామన్నారు. స్థానిక అధికారులను ఆశ్రయిస్తే ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లాలనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
డబ్బులు ఇప్పించండి..: సీతానగరం మండలం లచ్చయ్యపేట చక్కెర కర్మాగారంలో కార్మికులుగా పనిచేసిన 260 మందికి భవిష్యనిధి మొత్తాలను ఇప్పించాలని కార్మిక సంఘం కార్యదర్శి సన్యాసిరావు, కార్మికులు కోరారు. ఆర్ఆర్ చట్టం ప్రకారం కర్మాగారం ఆస్తులను జప్తు చేసి, రైతులకు చెల్లించారన్నారు. మిగిలిన మొత్తం కార్మికులకు భవిష్యనిధిగా చెల్లించాలని కోరారు. బకాయిలు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగ్గురి పాలిట మృత్యువు
[ 29-03-2024]
మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది.. -
ఇదేం బాదుడు
[ 29-03-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వైష్ణపు వీధిలో 998 చ.అ. ఓ నివాస భవనం (జీ+1) ఏఆర్వీ (వార్షిక అద్దె విలువ విధానం) అమల్లో ఉన్నప్పుడు 2020-21లో ఏడాదికి ఆస్తి పన్ను రూ.3792 ఉండేది. -
వేరే దారి లేక.. డోలీ మోత
[ 29-03-2024]
సరైన రోడ్లు లేకపోతే మనం అడుగు తీసి అడుగు బయట పెట్టలేం. అలాంటిది ఆ గిరిజన గ్రామంలో అసలు దారే లేదు. అలాంటి చోట ఏదైనా ప్రమాదం జరిగితే, ఆసుపత్రి దగ్గరలో లేకపోతే ఇక అంతే సంగతి. -
రోడ్లు లేవు.. సేవలూ కానరావు
[ 29-03-2024]
రైతులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీలు ఆదాయ వనరుగానే మిగిలాయి. చెక్పోస్టుల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతున్నా కనీస సేవలు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది. -
నిండు గర్భిణులకు ‘నడక’ యాతన
[ 29-03-2024]
కొమరాడ మండలంలోని కొండ శిఖర గ్రామం గుమడంగి. ఇక్కడికి ఎలాంటి రోడ్డు సౌకర్యమూ లేదు. గిరిజనులు ఆరు కిలోమీటర్లు నడిస్తే ఒడిశా రాష్ట్రంలోని వంటామాడకి, 17 కి.మీ వెళ్తే ఆంధ్రాలోని కుంతేసు చేరుకుంటారు. -
మీ ఓటు పదిలమేనా..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రతిసారి ఓటు వేస్తున్నాం ఈ సారి పోలింగ్ రోజున వినియోగించుకుంటామని ధీమాగా ఉంటే పొరబడినట్టే. -
సహకారం కరవు
[ 29-03-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్లు) నిస్తేజమవుతున్నాయి. లావాదేవీలు లేకపోవడంతో కొన్నేళ్లుగా సేవలు నిలిచిపోయాయి. -
అక్కడ సమస్యలనే చదవాలి!!
[ 29-03-2024]
వేలాది పుస్తకాలు.. పాఠకులకు పూర్తిస్థాయిలో వసతులు.. విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు సేదదీరేందుకు గదులు.. మరుగుదొడ్లు.. నచ్చిన పుస్తకాలు, పత్రికలు.. -
పరిశ్రమలు రావాలంటే.. చంద్రబాబు సీఎం కావాలి
[ 29-03-2024]
కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. -
వాన కాదు.. వల్లకాడుకు దారి లేదు
[ 29-03-2024]
గజపతినగరంలో రైల్వే మూడో లైను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో స్థానిక రాళ్ల చెరువుకు సంబంధించిన కల్వర్టును రైల్వే అధికారులు పొరపాటున కప్పేయడంతో సమీపంలోని రైల్వే కాలనీ వాసులు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు