కరి..ప్రమాదకరమేమరి!
ఒడిశాలో లకేరి అటవీ ప్రాంతంలోని గజరాజులు పుష్కర కాలానికి పైగా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో హల్చల్ చేస్తున్నాయి
గజరాజుల విధ్వంసంతో ఏటా నష్టం
కొమరాడ మండలం చెక్కవలస సమీపంలో సోమవారం సంచరిస్తున్న ఏనుగులు
ఈనాడు, విజయనగరం: ఒడిశాలో లకేరి అటవీ ప్రాంతంలోని గజరాజులు పుష్కర కాలానికి పైగా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో హల్చల్ చేస్తున్నాయి. చేతికందే పంటలను నాశనం చేస్తున్నాయి. ప్రజలను కంటి మీద కునుకు లేకుండా భయపెడుతున్నాయి. వీటి దాడులతో ఆస్తులే కాదు ప్రజలు, పాడి పశువుల ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోతున్నాయి. మరోవైపు ఏనుగులూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటి వరకు వివిధ కారణాలతో 11 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. కరిరాజులను తరలించండి.. మా పంటలు కాపాడండంటూ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా.. పాలకుల్లో స్పందన లేదు.
తొలిసారి చెరకు పంటకు విరామం
ఏటా నష్టాలు భరించలేక.. ప్రభుత్వం ఆదుకోక.. ఈ ఏడాది భామిని మండలం ఘనసర, తాలాడ గ్రామాల పరిధిలోని 300 ఎకరాల్లో తొలిసారి చెరకు పంటకు రైతులు విరామం ప్రకటించారు. కూలీలు సైతం పనులకు రావడం లేదు. బితుకు బితుకుమంటూ సాగు చేసినా చివరకు పంట చేతి కందడం లేదు. పాలకులకు మొర పెట్టుకున్నా.. నష్టపరిహారమూ చెల్లించడం లేదని.. ఈ రెండు గ్రామాల రైతులు వాపోతున్నారు.
ప్రభావిత ప్రాంతాలు..
భామిని మండలం పసుపూడి, తాలాడ, ఘనసర, కీసర, కోసలి, కురుపాం మండలం బాసంగివలస గ్రామాలు.. జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, బలిజిపేట, సీతంపేట మండలాల్లోని కొన్ని గ్రామాలు.
ఏటా రూ.5 కోట్లకు పైగా నష్టం
కరిరాజుల ప్రభావిత ప్రాంతాల్లో ఏటా చెరకు, జొన్న, అరటి సహా క్యారెట్, టమాటా, బీట్రూట్, బెండ, మిరప, వంగ తదితర రకాల పంటలపై ఏటా సుమారు రూ.5 కోట్లకు పైగా రైతులు నష్టపోతున్నారు.
కాగితాల్లోనే ప్రతిపాదనలు
ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాన్ని ‘ఎలిఫెంట్స్ కారిడార్’గా లేదా.. వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని అటవీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పంటల రక్షణ చర్యలకు సుమారు రూ.40 కోట్లు అవసరమని, అటవీ శాఖలో ఇప్పుడున్న మానవ వనరులతో వాటిని కట్టడి చేయడం కష్టమని వారు పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు జిల్లా అధికారులు పంపిన నివేదిక మేరకు ఉన్నతాధికారులు రూ.28 లక్షలు పరిహారం మంజూరు చేసినా, ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ సమస్య పరిష్కారానికి చేస్తున్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.
ఏటా నష్టాలు.. ఇంకెన్నాళ్లు..
‘సుమారు పదెకరాల్లో చెరకు, జొన్న, ఇతర పంటలు సాగు చేస్తున్నా. నాలుగేళ్ల నుంచి పంటను, సోలార్ బోర్లను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. పొలానికి వెళ్లాలంటేనే భయమేస్తోంది. కూలీలు పనులకు రావడం లేదు. కరిరాజుల కంటపడకుండా ఇద్దరు కాపలా ఉంటే.. మరో ఇద్దరు పొలంలో పనులు చేయాలి. మామిడి, జీడి తోటల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా రూ.4 లక్షల వరకూ నష్టపోతున్నా. అధికారులకు మొర పెట్టుకున్నా.. చర్యలు లేవు, పంట నష్ట పరిహారమూ లేదు. మేమెలా బతికేది..’
భామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన రైతు భూపతి ఆనందరావు ఆవేదన
కట్టడికి అధ్యయనం చేస్తున్నాం..
అభయారణ్యంగా ప్రకటిస్తే ఏనుగులను కట్టడి చేయొచ్చు. దీనిపై అధ్యయనం చేస్తున్నాం. ప్రభుత్వం నిధులిచ్చి, కొంత భూభాగం చూపాలి. వేసవిలో అటవీ ప్రాంతంలో నీరు దొరక్క మైదాన ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 12 ఏనుగులు సంచరిస్తున్నాయి. పంట నష్ట పరిహారానికి ఉన్నతాధికారులకు నివేదించాం. విద్యుత్తు నియంత్రికను తాకి నాలుగు ఏనుగులు మృత్యువాతపడిన తర్వాత ఆయా ప్రాంతాల్లో అదనపు సిబ్బందితోపాటు ప్రత్యేకంగా ఒక రేంజర్ను నియమించాం. పంట పొలాల్లో విద్యుత్తు నియంత్రికల ఎత్తు పెంచాలి.
ప్రసూన, డీఎఫ్వో, పార్వతీపురం మన్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావయ్యా.. మాగోడు వినవేమయ్యా!
[ 24-04-2024]
మాతాశిశు సంరక్షణే ధ్యేయమని చెప్పుకొంటున్న వైకాపా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అవస్థల్లోకి నెట్టింది. కనీస సదుపాయాలు లేక చిన్నారులు, లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. -
జగనన్న ఏలుబడి.. అవస్థల అంగన్వాడీ!
[ 24-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులకు ఆటపాటలతో కూడిన చదువు చెప్పడం, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడానికి సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీటికి సొంత భవనాలు సమకూరక.. రేకుల షెడ్లలో, చాలీచాలని అద్దె కొంపల్లో కొనసాగుతున్నాయి. -
ఆడబిడ్డల సింహగర్జనలో.. వైకాపా కొట్టుకుపోతుంది
[ 24-04-2024]
‘తెదేపా ఎప్పుడూ మహిళా పక్షపాతి. ఆడపిల్లల అక్షరజ్ఞానంతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని నమ్మి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలికలంతా చదువుకోవాలని 8, 9, 10 తరగతుల వారికి సైకిళ్లు ఇచ్చా. -
స్ట్రాంగ్ రూంలు సిద్ధం చేయండి
[ 24-04-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూంలను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు -
జనాలు తక్కువ.. జెండాలెక్కువ
[ 24-04-2024]
-
డ్రైవర్లు... అల్లాడుతున్నారు!
[ 24-04-2024]
-
ఆర్వో కల్పనాకుమారి ఆకస్మిక బదిలీ
[ 24-04-2024]
సీతంపేట ఐటీడీఏ పీవో కల్పనాకుమారిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆమె పాలకొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిణిగా కూడా ఉన్నారు. -
హామీల జగన్మోసం..పనులంటే నిర్లక్ష్యం!
[ 24-04-2024]
‘మేం అధికారంలోకి వస్తే మడ్డువలస జలాశయం రెండోఫేజ్ పూర్తిచేసి, 37 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం’ అంటూ అయిదేళ్ల కిందట ఊదరగొట్టిన వైకాపా నేతలు ఆ సర్కారు కొలువు దీరిన తరువాత మాత్రం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది -
తెదేపాలోకి వైకాపా ఎంపీటీసీ సభ్యులు
[ 24-04-2024]
కొత్తవలసకు చెందిన పలువురు వైకాపా ఎంపీటీసీ సభ్యులు, ఆ పార్టీ నాయకులు తెదేపాలో చేరారు. శృంగవరపుకోటలో ప్రజాగళం సభకు వచ్చి సిరికి రిసార్ట్స్లో బసచేసిన తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో కె.కృష్ణమూర్తి- కొత్తవలస-3, వి.సూర్యనారాయణశాస్త్రి(బాబి)-క్తొతవలస-5, అప్పన్నదొరపాలెం ఎంపీటీసీ సభ్యురాలు యు.గురూజీ భర్త రాంబాబు, కొత్తవలస-6 ఎంపీటీసీ సభ్యురాలు పి.లక్ష్మి కుమారుడు పాత్రుడు, రెల్లి గ్రామానికి చెందిన కొత్తవలస పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ వి.అప్పారావు, విశాఖ పార్లమెంట్ వైకాపా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పి.శ్రీను, గిరిజన సంఘం నాయకుడు యు.నరసింగరావు, రామమూర్తి (దాసరివానిపాలెం) తెదేపాలో చేరారు. వీరికి చంద్రబాబు తెదేపా కండువాలు వేశారు. -
బి-ఫారం అందుకున్న బేబినాయన
[ 24-04-2024]
బొబ్బిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి బేబినాయన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నుంచి బి-ఫారం అందుకున్నారు -
అన్నొస్తే.. ఇబ్బందులే
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభ జరుగుతోందంటే ప్రజలకు ప్రయాణానికి పాట్లు తప్పడం లేదు. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి
[ 24-04-2024]
పుర్లి, దేవుదళ తదితర గ్రామాల్లో నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ప్రచారం నిర్వహించారు. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, గెలిపించాలని విజ్ఞప్తి చేశారు