నిర్లక్ష్యం మురుగై పోరుతోంది
ఉమ్మడి జిల్లాలో మురుగు సమస్య తాండవిస్తోంది. ప్రధాన రోడ్లు, వీధులు, కాలనీలన్నీ వ్యర్థ జలాలతో నిండిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి ఈ చిత్రాలు.
న్యూస్టుడే, మక్కువ, పార్వతీపురం పురపాలక, భోగాపురం, పాలకొండ/గ్రామీణం, పార్వతీపురం పట్టణం
ఉమ్మడి జిల్లాలో మురుగు సమస్య తాండవిస్తోంది. ప్రధాన రోడ్లు, వీధులు, కాలనీలన్నీ వ్యర్థ జలాలతో నిండిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి ఈ చిత్రాలు.
పార్వతీపురంలోని అయ్యప్ప మందిరం సమీపంలో చెత్త కుప్ప ఇలా పేరుకుపోయింది. దీంతో ఇటుగా రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులను పంపించి చెత్త తరలిస్తామని శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీ తెలిపారు.
మక్కువ మండల కేంద్రం నుంచి సాలూరు పట్టణానికి 19.60 కిలోమీటర్ల మేర రహదారి వేసేందుకు రెండేళ్ల కిందట రూ.55.56 కోట్ల నిధులు మంజూరైనా పనులు పూర్తికాలేదు. అంతంతమాత్రమే చేయడంతో ఎక్కడికక్కడే నీళ్లు నిలిచిపోతున్నాయి. పరిష్కారానికి తాత్కాలిక కాలువలు నిర్మిస్తున్నామని ఆర్అండ్బీ జేఈ కమలాకర్ తెలిపారు.
పార్వతీపురం జిల్లా కేంద్రంలోని చినదేవరవీధిలో నెలకొన్న దుస్థితి ఇది. కొళాయిల నుంచి నీరొచ్చినా ప్రతిసారీ ఇలా మురుగుమయమవుతోంది. నాలుగేళ్లుగా ఈ సమస్య ఉన్నా ఎవరూ స్పందించడం లేదు. కాలువల్లో పూడికలు తొలగించి, పరిస్థితిని చక్కదిద్దుతామని కమిషనర్ రామప్పలనాయుడు పేర్కొన్నారు.
పాలకొండలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణమిది. వర్షపునీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఇలా ఒకేచోట నిలిచిపోతోంది. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. సమీపంలో ఉన్న ఆంజనేయనగర్, టీచర్స్ కాలనీ వాసులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఆవరణను ఎత్తు చేస్తామని డిపో మేనేజరు వెంకటేశ్వరరావు తెలిపారు.
ఇళ్ల వెనుకభాగంలో పేరుకుపోయిన వ్యర్థాలు
భోగాపురం మండలంలో పెద్ద పంచాయతీగా గుర్తింపు పొందిన ముంజేరులో సిద్ధార్థనగర్కు వెళ్లే దారిది. ఇక్కడ కాలువలు, సీసీ రోడ్డు నిర్మించారు. మధ్యలోనే ఆగిపోవడంతో ఇలా కాలనీ చివర మురుగునీరు పేరుకుపోతోంది. జిల్లా అధికారులతో పాటు, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కూడా దీనిపై స్పందించినా ఫలితం దక్కడం లేదు. అక్కడివారు సహకరిస్తే.. వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఎంపీడీవో బంగారయ్య చెప్పారు.
రహదారి మీదుగా వెళ్లలేని పరిస్థితి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావయ్యా.. మాగోడు వినవేమయ్యా!
[ 24-04-2024]
మాతాశిశు సంరక్షణే ధ్యేయమని చెప్పుకొంటున్న వైకాపా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అవస్థల్లోకి నెట్టింది. కనీస సదుపాయాలు లేక చిన్నారులు, లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. -
జగనన్న ఏలుబడి.. అవస్థల అంగన్వాడీ!
[ 24-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులకు ఆటపాటలతో కూడిన చదువు చెప్పడం, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడానికి సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీటికి సొంత భవనాలు సమకూరక.. రేకుల షెడ్లలో, చాలీచాలని అద్దె కొంపల్లో కొనసాగుతున్నాయి. -
ఆడబిడ్డల సింహగర్జనలో.. వైకాపా కొట్టుకుపోతుంది
[ 24-04-2024]
‘తెదేపా ఎప్పుడూ మహిళా పక్షపాతి. ఆడపిల్లల అక్షరజ్ఞానంతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని నమ్మి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలికలంతా చదువుకోవాలని 8, 9, 10 తరగతుల వారికి సైకిళ్లు ఇచ్చా. -
స్ట్రాంగ్ రూంలు సిద్ధం చేయండి
[ 24-04-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూంలను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు -
జనాలు తక్కువ.. జెండాలెక్కువ
[ 24-04-2024]
విజయనగరం సమీపంలోని చెల్లూరులో మంగళవారం వైకాపా సిద్ధం సభ పేలవంగా సాగింది. -
డ్రైవర్లు... అల్లాడుతున్నారు!
[ 24-04-2024]
-
ఆర్వో కల్పనాకుమారి ఆకస్మిక బదిలీ
[ 24-04-2024]
సీతంపేట ఐటీడీఏ పీవో కల్పనాకుమారిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆమె పాలకొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిణిగా కూడా ఉన్నారు. -
హామీల జగన్మోసం..పనులంటే నిర్లక్ష్యం!
[ 24-04-2024]
‘మేం అధికారంలోకి వస్తే మడ్డువలస జలాశయం రెండోఫేజ్ పూర్తిచేసి, 37 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం’ అంటూ అయిదేళ్ల కిందట ఊదరగొట్టిన వైకాపా నేతలు ఆ సర్కారు కొలువు దీరిన తరువాత మాత్రం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది -
తెదేపాలోకి వైకాపా ఎంపీటీసీ సభ్యులు
[ 24-04-2024]
కొత్తవలసకు చెందిన పలువురు వైకాపా ఎంపీటీసీ సభ్యులు, ఆ పార్టీ నాయకులు తెదేపాలో చేరారు. శృంగవరపుకోటలో ప్రజాగళం సభకు వచ్చి సిరికి రిసార్ట్స్లో... -
బి-ఫారం అందుకున్న బేబినాయన
[ 24-04-2024]
బొబ్బిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి బేబినాయన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నుంచి బి-ఫారం అందుకున్నారు -
అన్నొస్తే.. ఇబ్బందులే
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభ జరుగుతోందంటే ప్రజలకు ప్రయాణానికి పాట్లు తప్పడం లేదు. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి
[ 24-04-2024]
పుర్లి, దేవుదళ తదితర గ్రామాల్లో నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ప్రచారం నిర్వహించారు. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, గెలిపించాలని విజ్ఞప్తి చేశారు