అన్నదాతకు అండగా అడుగులు
ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) అన్నదాతలకు అండగా నిలుస్తోంది.
సేవల విస్తరణతో కేవీకే ఆదర్శం
కృషి విజ్ఞాన కేంద్రం
గుమ్మలక్ష్మీపురం, న్యూస్టుడే: ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఖరీఫ్లో వ్యవసాయ, అనుబంధ శాఖలు చేపడుతున్న కార్యక్రమాలతో పాటు రైతులు ఆచరిస్తున్న సాగు పద్ధతులు, పంట దిగుబడిని పరిగణనలోకి తీసుకుని సూచనలు చేస్తోంది. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను రైతు చెంతకు చేరుస్తోంది. శిక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు, కిసాన్ మేళాలు, పంట ఉత్పత్తుల ప్రదర్శన, పలు రకాల విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందిస్తూ ముందుకెళ్తోంది.
వెయ్యి మందికి పైగా...
ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యి మంది రైతులకు కేవీకే సేవలందిస్తోంది. ఇకపై 1500 మంది రైతులకు సేవలందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన రహదారుల పక్కనే వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాల ఏర్పాటు, సేంద్రియ, ప్రకృతి సేద్యం ప్రాధాన్యతపై అవగాహన కల్పించనుంది. గ్లాడియోలస్ వంటి అరుదైన పూల రకాలను పెంచేలా ప్రోత్సహిస్తోంది. ఆయా మార్గాల్లో ప్రయాణించే వారికి అవగాహన కలుగుతుంది.
పెంచుతున్న టర్కీ కోళ్లు
ప్రణాళిక అమలు ఇలా...
సాధారణంగా రైతులు సాగులో పాత రకాలనే ఎంపిక చేసుకుంటారు.
* కొత్త వంగడాలను రైతులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో బీర, టమాటా, వంకాయ, దాల్చినచెక్క వంటి కొత్తరకాల విత్తనాలు రైతులకు ఉచితంగా అందజేయనున్నారు.
* 10 వేల జీడి మొక్కలు పంపిణీ చేసేందుకు, నర్సరీలు సిద్ధం చేస్తున్నారు.
* ఆధునిక పద్ధతులపై శాస్త్రవేత్తలు నిరంతరం సూచనలిస్తున్నారు.
* అరుదైన టర్కీ కోళ్ల పెంపకం చేపడుతున్నారు. వీటి నుంచి పిల్లల్ని ఉత్పత్తి చేసి, జిల్లాకు పరిచయం చేయనున్నారు.
* పుట్టగొడుగుల పెంపకం, వానపాములతో వర్మీకంపోస్టు తయారీపై శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే చిరుధాన్యాలతో విలువ ఆధారిత బేకరీ, బిస్కెట్లు తయారు చేయడం.
* జీడి పండ్లతో ఉప ఉత్పత్తుల తయారీపై మహిళలకు శిక్షణ ఇస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి: కేవీకే సేవలను రైతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. కాలానుగుణంగా రైతు ఆలోచన విధానంలో మార్పు రావాలి. నూతన యాంత్రీకరణపై దృష్టిసారించి, పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలి. సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. రహదారుల పక్కనే ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయనున్నాం.
డాక్టర్ టీఎస్ఎస్కే పాత్ర్, కేవీకే సమన్వయకర్త
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి విజయంతోనే భవిష్యత్తు
[ 19-04-2024]
మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కోరారు. -
బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా
[ 19-04-2024]
మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్మోహన్రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. -
భేష్.. ముహూర్త బలం
[ 19-04-2024]
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట.. -
తొలిరోజు 12 నామినేషన్లు
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు. -
బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లేనట!!
[ 19-04-2024]
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి (52) సంపద అయిదేళ్లలో రూ.3 కోట్లే పెరిగిందట. ఇది విన్న నియోజకవర్గ ప్రజలు అబ్బే అంత తక్కువ ఉండటం ఏమిటని అనుకోవడం వినిపించింది. -
మాయల పకీరు జగన్ అవసరమా?: కళా
[ 19-04-2024]
మాయల పకీరు ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలంతా ఆలోచించాలని కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాం మేజరు పంచాయతీలో గురువారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. -
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి