మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి?
ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులు, స్నేహితుల తర్వాత ఎక్కువ గడిపేది మీతోనే. మీలోనే క్రమశిక్షణ లేకపోతే.. మిమ్మల్ని చూసి వారేమి నేర్చుకుంటారు? రాబోయే తరాన్ని క్రమశిక్షణ లేకుండా చేస్తున్నారు.
ఉపాధ్యాయులతో ప్రవీణ్ పకాశ్
కస్పా పాఠశాలలో విద్యార్థుల వర్క్బుక్ పరిశీలిస్తున్న ప్రిన్సిపల్ కార్యదర్శి
ఈనాడు, విజయనగరం, విద్యావిభాగం, పట్టణం, న్యూస్టుడే: ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులు, స్నేహితుల తర్వాత ఎక్కువ గడిపేది మీతోనే. మీలోనే క్రమశిక్షణ లేకపోతే.. మిమ్మల్ని చూసి వారేమి నేర్చుకుంటారు? రాబోయే తరాన్ని క్రమశిక్షణ లేకుండా చేస్తున్నారు.
విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్
విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శనివారం నగరంలో పర్యటించి, కస్పా, రామకృష్ణ పాఠశాలలను పరిశీలించారు. అక్టోబరు 3 నుంచి ఫార్మేటివ్ పరీక్షలు జరుగుతాయని తెలిసినా విద్యార్థులతో వర్క్బుక్స్ రాయించడం, మూల్యాంకనం చేయకపోవడంపై మండిపడ్డారు. అధ్యాపకుల నుంచి ఎంఈవో, డీడీఈవో, డీఈవో, ఆర్జేడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు ఉపాధ్యాయులపై చర్యలకు సిఫార్సు చేశారు. సస్పెండ్ చేసే అధికారమున్నా క్షేత్రస్థాయిలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి, ఆర్జేడీ జ్యోతికుమారిని ప్రశ్నించారు. విద్యలో ఇండియా ఏమీ తక్కువ కాదని, హార్డ్వర్క్ చేయకపోవడమే లోపమని పేర్కొన్నారు. పరిసరాలు పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించి ఒకరికి స్వయంగా భోజనం తినిపించారు.
విద్యార్థులను బయటకు పంపించి..: కస్పా ఉన్నత పాఠశాలలో ఏడో తరగతిలో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకున్నారు. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో వర్క్బుక్స్ను కొందరు రాయకపోవడం, రాసినవి ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ, డీఈవోలను ఆదేశించారు. తరగతి గది నుంచి విద్యార్థులను బయటకు పంపి, ఉపాధ్యాయులు, అధికారులతో లోపాలపై చర్చించారు.
కమిషనర్ పేరు తెలియదా?...: నగరంలో 15 డివిజన్ సచివాలయం సందర్శనలో ఇద్దరు వాలంటీర్లకు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీరాములనాయుడిని చూపించి.. ఎవరని అడిగారు. తెలియదని వారు చెప్పడంతో.. రోజుకో సచివాలయం సందర్శిస్తే తెలుస్తుందని కమిషనర్కు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదాత అతలాకుతలం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేసింది. బుధవారం కుండపోతగా వాన కురిసి పంటలను ముంచేసింది. జన జీవనం స్తంభించింది. -
రూ.13 కోట్లు ఇస్తేనే పనులు
[ 07-12-2023]
అయిదేళ్లుగా ఖరీఫ్లో ఆగుతూ... రబీలో సాగుతున్నాయి తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ. -
అరకు మార్గంలో నిలిచిన రాకపోకలు
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో బొర్రా, అనంతగిరి మార్గంలోని అరకు సమీప బీసుపురం వద్ద మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు -
హోంగార్డుల సేవలు కీలకం
[ 07-12-2023]
పోలీసు శాఖలో హోం గార్డుల సేవలు కీలకమని, శాంతిభద్రతల పర్యవేక్షణలో వారు చూపుతున్న ప్రతిభ ప్రశంసనీయమని అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ అన్నారు. -
సర్పంచులంతా ఉద్యమించాలి
[ 07-12-2023]
నిధులు, విధులు, అధికారాల సాధన కోసం సర్పంచులు ఐక్యంగా ఉద్యమించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి గేదెల రాజారావు కోరారు. -
ఒంటరి ఏనుగు ఏమైందో
[ 07-12-2023]
పార్వతీపురం మన్యం ప్రజలకు హరి పేరుతో ఒంటరి ఏనుగు సుపరిచితమే. అది నెల రోజుల కిందట ఒడిశా వైపు వెళ్లింది. -
నష్టాలను మిగిల్చిన మిగ్జాం
[ 07-12-2023]
మిగ్జాం తుపానుతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. వ్యవసాయశాఖతో పాటు అన్ని శాఖల పరిధిలో తీవ్ర నష్టం జరిగింది. -
అధ్యక్షా మునిగాం
[ 07-12-2023]
శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నివాసముండే విజయనగరం జిల్లా కేంద్రంలోని 31 డివిజన్ పరిధిలో పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. -
బరువులెత్తి... పతకాలు పట్టి
[ 07-12-2023]
ఎక్కడో మారుమూల గ్రామస్థులు వారు.. అయితేనేం.. పట్టుబట్టి ఎంత బరువునైనా తలకెత్తగల సత్తా ఉంది. పల్లె ఖ్యాతిని విదేశీయుల గడ్డపై చాటి, పతకాలు బాటపట్టిన ఘటన సొంతమైంది. -
ఓటు నమోదుకు మూడు రోజులే గడువు
[ 07-12-2023]
కొత్త ఓటర్లుగా నమోదయ్యేందుకు మూడు రోజులే గడువుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు.


తాజా వార్తలు (Latest News)
-
Telangana Ministers: మంత్రులుగా ప్రమాణం చేయనుంది వీళ్లే..!
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కాసేపట్లో నగరానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం