సమావేశాలను సద్వినియోగం చేసుకోని తెదేపా
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ మీద రాద్ధాంతం చేస్తున్న తెదేపా శాసనసభ సమావేశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిందని డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం నగరంలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు.
ఉప సభాపతి వీరభద్రస్వామి
మాట్లాడుతున్న కోలగట్ల
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ మీద రాద్ధాంతం చేస్తున్న తెదేపా శాసనసభ సమావేశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిందని డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం నగరంలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో వాస్తవం ప్రజలకు తెలిపేందుకు శాసనసభలో వచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ సభ్యులే జారవిడుచుకున్నారని విమర్శించారు. 21, 22 తేదీల్లో జరిగిన సమావేశాల్లో తెదేపా సభ్యుల ప్రవర్తనను ప్రజలంతా గమనించారని చెప్పారు. అర్థవంతమైన చర్చ జరగాల్సిన సభలో మీసం తిప్పడం.. విజిల్ వేయడం ద్వారా అగౌరవపరిచారని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ మీద చర్చ కోరకుండా, కేసులు ఎత్తివేయాలని అరవడం ఎంత వరకు సమంజసమన్నారు. ఎన్టీఆర్ వెన్నుపోటులో భాగస్వామి అయిన అశోక్ ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తుంటారని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా పోలీసు వారి అనుమతి తీసుకుంటే బాగుంటుందని బేబినాయన అరెస్ట్ విషయంలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదాత అతలాకుతలం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేసింది. బుధవారం కుండపోతగా వాన కురిసి పంటలను ముంచేసింది. జన జీవనం స్తంభించింది. -
రూ.13 కోట్లు ఇస్తేనే పనులు
[ 07-12-2023]
అయిదేళ్లుగా ఖరీఫ్లో ఆగుతూ... రబీలో సాగుతున్నాయి తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ. -
అరకు మార్గంలో నిలిచిన రాకపోకలు
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో బొర్రా, అనంతగిరి మార్గంలోని అరకు సమీప బీసుపురం వద్ద మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు -
హోంగార్డుల సేవలు కీలకం
[ 07-12-2023]
పోలీసు శాఖలో హోం గార్డుల సేవలు కీలకమని, శాంతిభద్రతల పర్యవేక్షణలో వారు చూపుతున్న ప్రతిభ ప్రశంసనీయమని అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ అన్నారు. -
సర్పంచులంతా ఉద్యమించాలి
[ 07-12-2023]
నిధులు, విధులు, అధికారాల సాధన కోసం సర్పంచులు ఐక్యంగా ఉద్యమించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి గేదెల రాజారావు కోరారు. -
ఒంటరి ఏనుగు ఏమైందో
[ 07-12-2023]
పార్వతీపురం మన్యం ప్రజలకు హరి పేరుతో ఒంటరి ఏనుగు సుపరిచితమే. అది నెల రోజుల కిందట ఒడిశా వైపు వెళ్లింది. -
నష్టాలను మిగిల్చిన మిగ్జాం
[ 07-12-2023]
మిగ్జాం తుపానుతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. వ్యవసాయశాఖతో పాటు అన్ని శాఖల పరిధిలో తీవ్ర నష్టం జరిగింది. -
అధ్యక్షా మునిగాం
[ 07-12-2023]
శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నివాసముండే విజయనగరం జిల్లా కేంద్రంలోని 31 డివిజన్ పరిధిలో పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. -
బరువులెత్తి... పతకాలు పట్టి
[ 07-12-2023]
ఎక్కడో మారుమూల గ్రామస్థులు వారు.. అయితేనేం.. పట్టుబట్టి ఎంత బరువునైనా తలకెత్తగల సత్తా ఉంది. పల్లె ఖ్యాతిని విదేశీయుల గడ్డపై చాటి, పతకాలు బాటపట్టిన ఘటన సొంతమైంది. -
ఓటు నమోదుకు మూడు రోజులే గడువు
[ 07-12-2023]
కొత్త ఓటర్లుగా నమోదయ్యేందుకు మూడు రోజులే గడువుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు.


తాజా వార్తలు (Latest News)
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం