ఆర్టీసీ విలీనంతో ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని, ఇంతవరకు పీఎఫ్, నగదు సెలవులకు సంబంధించి రూ.900 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్ఎంయూఏ) రాష్ట్ర అధ్యక్షుడు పివి. రమణారెడ్డి అన్నారు
ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి
విజయోత్సవ సభలో మాట్లాడుతున్న ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి
సాలూరు, న్యూస్టుడే: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని, ఇంతవరకు పీఎఫ్, నగదు సెలవులకు సంబంధించి రూ.900 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్ఎంయూఏ) రాష్ట్ర అధ్యక్షుడు పివి. రమణారెడ్డి అన్నారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడతాయని దాచుకున్న డబ్బులు అందక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారన్నారు. ఏపీపీటీడీ చరిత్రలో ఎన్ఎంయూఏకు మొదటిసారిగా గుర్తింపు వచ్చినందుకు శనివారం సాలూరులోని లూథరన్ కమ్యూనిటీ హాలులో విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వపరం చేస్తే ఏదో జరుగుతుందని భావించిన కార్మికుల ఆశలన్నీ అడియాసలు అయ్యాయన్నారు. ఓపీఎస్, సీపీఎస్, జీపీఎస్ ఏదీ లేదన్నారు. సీనియార్టీ ప్రకారం పదోన్నతులు లేవన్నారు. నష్టాల పేరుతో గ్రామాలకు పల్లెవెలుగు సర్వీసులు నిలిపివేస్తున్నారన్నారు. ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ కారుణ్య నియామకాలు పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నర్శింగరావు, శిమ్మయ్య, మోహన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏటీ నాయుడు, శేఖర్, జోనల్ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదాత అతలాకుతలం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేసింది. బుధవారం కుండపోతగా వాన కురిసి పంటలను ముంచేసింది. జన జీవనం స్తంభించింది. -
రూ.13 కోట్లు ఇస్తేనే పనులు
[ 07-12-2023]
అయిదేళ్లుగా ఖరీఫ్లో ఆగుతూ... రబీలో సాగుతున్నాయి తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ. -
అరకు మార్గంలో నిలిచిన రాకపోకలు
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో బొర్రా, అనంతగిరి మార్గంలోని అరకు సమీప బీసుపురం వద్ద మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు -
హోంగార్డుల సేవలు కీలకం
[ 07-12-2023]
పోలీసు శాఖలో హోం గార్డుల సేవలు కీలకమని, శాంతిభద్రతల పర్యవేక్షణలో వారు చూపుతున్న ప్రతిభ ప్రశంసనీయమని అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ అన్నారు. -
సర్పంచులంతా ఉద్యమించాలి
[ 07-12-2023]
నిధులు, విధులు, అధికారాల సాధన కోసం సర్పంచులు ఐక్యంగా ఉద్యమించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి గేదెల రాజారావు కోరారు. -
ఒంటరి ఏనుగు ఏమైందో
[ 07-12-2023]
పార్వతీపురం మన్యం ప్రజలకు హరి పేరుతో ఒంటరి ఏనుగు సుపరిచితమే. అది నెల రోజుల కిందట ఒడిశా వైపు వెళ్లింది. -
నష్టాలను మిగిల్చిన మిగ్జాం
[ 07-12-2023]
మిగ్జాం తుపానుతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. వ్యవసాయశాఖతో పాటు అన్ని శాఖల పరిధిలో తీవ్ర నష్టం జరిగింది. -
అధ్యక్షా మునిగాం
[ 07-12-2023]
శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నివాసముండే విజయనగరం జిల్లా కేంద్రంలోని 31 డివిజన్ పరిధిలో పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. -
బరువులెత్తి... పతకాలు పట్టి
[ 07-12-2023]
ఎక్కడో మారుమూల గ్రామస్థులు వారు.. అయితేనేం.. పట్టుబట్టి ఎంత బరువునైనా తలకెత్తగల సత్తా ఉంది. పల్లె ఖ్యాతిని విదేశీయుల గడ్డపై చాటి, పతకాలు బాటపట్టిన ఘటన సొంతమైంది. -
ఓటు నమోదుకు మూడు రోజులే గడువు
[ 07-12-2023]
కొత్త ఓటర్లుగా నమోదయ్యేందుకు మూడు రోజులే గడువుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు.


తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
-
నిజామాబాద్ బబ్లూను.. నిన్ను లేపేస్తా: డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన మందుబాబు వీరంగం
-
Chicken Price: చికెన్ అగ్గువ.. గుడ్డు పిరం