‘ఓపీఎస్పై హామీలు ఏమయ్యాయి?’
రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్కి బదులుగా జీపీఎస్ను తీసుకురావడాన్ని నిరసిస్తూ ఫ్యాప్టో, ఏపీసీ, పీఎస్ఈఏల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద వినూత్న నిరసన తెలిపారు
మెడకి ఉరి తాళ్లతో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
పార్వతీపురం పట్టణం, పాలకొండ గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్కి బదులుగా జీపీఎస్ను తీసుకురావడాన్ని నిరసిస్తూ ఫ్యాప్టో, ఏపీసీ, పీఎస్ఈఏల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద వినూత్న నిరసన తెలిపారు. మెడకు ఉరితాళ్లు బిగించుకొని ఆందోళన చేపట్టారు. జీపీఎస్ వద్దు.. ఓపీఎస్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు అన్నారు. ఇప్పుడేమో సీపీఎస్కు బదులుగా జీపీఎస్ తీసుకురావడమంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేయడమేనన్నారు. ఓపీఎస్ సాధించే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. వివిధ సంఘాల నాయకులు శ్రీనివాసరావు, బాలకృష్ణ, శివున్నాయుడు, కె.విజయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాలకొండ తహసీల్దారు కార్యాలయం ముందు ఉపాధ్యాయులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సంఘ నాయకులు ఎస్.వాసుదేవరావు, జి.సూర్యనారాయణ, టి.ఉమామహేశ్వరరావు, బీవీ రమణ, కె.పద్మజ, నాగరాజు, పైడిరాజు, గోవిందరావు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదాత అతలాకుతలం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేసింది. బుధవారం కుండపోతగా వాన కురిసి పంటలను ముంచేసింది. జన జీవనం స్తంభించింది. -
రూ.13 కోట్లు ఇస్తేనే పనులు
[ 07-12-2023]
అయిదేళ్లుగా ఖరీఫ్లో ఆగుతూ... రబీలో సాగుతున్నాయి తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ. -
అరకు మార్గంలో నిలిచిన రాకపోకలు
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో బొర్రా, అనంతగిరి మార్గంలోని అరకు సమీప బీసుపురం వద్ద మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు -
హోంగార్డుల సేవలు కీలకం
[ 07-12-2023]
పోలీసు శాఖలో హోం గార్డుల సేవలు కీలకమని, శాంతిభద్రతల పర్యవేక్షణలో వారు చూపుతున్న ప్రతిభ ప్రశంసనీయమని అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ అన్నారు. -
సర్పంచులంతా ఉద్యమించాలి
[ 07-12-2023]
నిధులు, విధులు, అధికారాల సాధన కోసం సర్పంచులు ఐక్యంగా ఉద్యమించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి గేదెల రాజారావు కోరారు. -
ఒంటరి ఏనుగు ఏమైందో
[ 07-12-2023]
పార్వతీపురం మన్యం ప్రజలకు హరి పేరుతో ఒంటరి ఏనుగు సుపరిచితమే. అది నెల రోజుల కిందట ఒడిశా వైపు వెళ్లింది. -
నష్టాలను మిగిల్చిన మిగ్జాం
[ 07-12-2023]
మిగ్జాం తుపానుతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. వ్యవసాయశాఖతో పాటు అన్ని శాఖల పరిధిలో తీవ్ర నష్టం జరిగింది. -
అధ్యక్షా మునిగాం
[ 07-12-2023]
శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నివాసముండే విజయనగరం జిల్లా కేంద్రంలోని 31 డివిజన్ పరిధిలో పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. -
బరువులెత్తి... పతకాలు పట్టి
[ 07-12-2023]
ఎక్కడో మారుమూల గ్రామస్థులు వారు.. అయితేనేం.. పట్టుబట్టి ఎంత బరువునైనా తలకెత్తగల సత్తా ఉంది. పల్లె ఖ్యాతిని విదేశీయుల గడ్డపై చాటి, పతకాలు బాటపట్టిన ఘటన సొంతమైంది. -
ఓటు నమోదుకు మూడు రోజులే గడువు
[ 07-12-2023]
కొత్త ఓటర్లుగా నమోదయ్యేందుకు మూడు రోజులే గడువుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం