కదం తొక్కి.. గళం విప్పి
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ పార్వతీపురంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బి.విజయ్చంద్ర, మహిళా విభాగం నాయకురాలు డి.శ్రీదేవి ఆధ్వర్యంలో బాబు కోసం- మేము సైతం పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
కొనసాగుతున్న తెదేపా నిరసనలు
పార్వతీపురంలో భారీ ర్యాలీ
పార్వతీపురంలో విజయచంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
పార్వతీపురం, పట్టణం, కలెక్టరేట్ ప్రాంగణం, పాచిపెంట, న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ పార్వతీపురంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బి.విజయ్చంద్ర, మహిళా విభాగం నాయకురాలు డి.శ్రీదేవి ఆధ్వర్యంలో బాబు కోసం- మేము సైతం పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని సంఘీభావం తెలిపారు. అదరం.. బెదరం.. అక్రమార్కులను వదలమంటూ నినాదాలు చేశారు. బీ పాచిపెంటలో ఆ పార్టీ నేత పి.ప్రసాద్బాబు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భంజ్దేవ్ పాల్గొన్నారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంతోషి, ఈశ్వరరావు, మోహన్రావు, పోలినాయుడు, పైడిపినాయుడు, సాయిబాబా, పారమ్మ, జనసేన నాయకులు ఉపేంద్ర పాల్గొన్నారు.
దీక్ష బూని.. పూజలు చేసి
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: అశోక్ బంగ్లా వద్ద సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన దీక్షల్లో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి.సత్యమోహన్, నాయకులు కె.పైడిరాజు, బాలచంద్ర నాయుడు, కృష్ణారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం వీరికి పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. మాజీ ఎమ్మెల్యే మీసాలగీత తన అనుచరులతో రామతీర్థం ఆలయాన్ని సందర్శించి, చంద్రబాబు విడుదల కోరుతూ పూజలు చేశారు. నగరంలో ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులకు పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. టి.రమణ, డి.రవిరాజు, జి.ప్రణయ్ పాల్గొన్నారు.
బాబు కోసం మేముసైతం
గజపతినగరం: జాతీయ రహదారి పక్కన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో దీక్షల్లో గీతకార్మికులు పాల్గొని మద్దతు తెలిపారు. చంద్రబాబుకు అండగా ఉంటామన్నారు. కొరుపోలు రమేష్కుమార్, ఈశ్వరరావు, చిన్నంనాయుడు పాల్గొన్నారు.
వినూత్న నిరసన..: ప్రజాధనం రూ.43వేల కోట్లు తిన్న జగన్మోహన్రెడ్డి బెయిల్ పొంది శనివారం నాటికి పదేళ్లు పూర్తయిందని, అప్పటి నుంచి రాష్ట్రంలో అస్తవ్యస్త పాలనతో ప్రజలకు తిప్పలు తప్పడంలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా కేకుకోసి వినూత్నంగా నిరసన తెలిపారు.
నెల్లిమర్ల: రాష్ట్రంలో వైకాపా తీరును ప్రజలంతా గమనిస్తున్నారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. నెల్లిమర్లలో గీత కార్మికులతో కలసి రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై కుట్రపూరితమైన విధానాన్ని అవలంభిస్తోందన్నారు. కార్యక్రమంలో చిన్నంనాయుడు, రవిశేఖర్, రాజారావు, సత్యనారాయణ, ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదాత అతలాకుతలం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేసింది. బుధవారం కుండపోతగా వాన కురిసి పంటలను ముంచేసింది. జన జీవనం స్తంభించింది. -
రూ.13 కోట్లు ఇస్తేనే పనులు
[ 07-12-2023]
అయిదేళ్లుగా ఖరీఫ్లో ఆగుతూ... రబీలో సాగుతున్నాయి తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ. -
అరకు మార్గంలో నిలిచిన రాకపోకలు
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో బొర్రా, అనంతగిరి మార్గంలోని అరకు సమీప బీసుపురం వద్ద మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు -
హోంగార్డుల సేవలు కీలకం
[ 07-12-2023]
పోలీసు శాఖలో హోం గార్డుల సేవలు కీలకమని, శాంతిభద్రతల పర్యవేక్షణలో వారు చూపుతున్న ప్రతిభ ప్రశంసనీయమని అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ అన్నారు. -
సర్పంచులంతా ఉద్యమించాలి
[ 07-12-2023]
నిధులు, విధులు, అధికారాల సాధన కోసం సర్పంచులు ఐక్యంగా ఉద్యమించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి గేదెల రాజారావు కోరారు. -
ఒంటరి ఏనుగు ఏమైందో
[ 07-12-2023]
పార్వతీపురం మన్యం ప్రజలకు హరి పేరుతో ఒంటరి ఏనుగు సుపరిచితమే. అది నెల రోజుల కిందట ఒడిశా వైపు వెళ్లింది. -
నష్టాలను మిగిల్చిన మిగ్జాం
[ 07-12-2023]
మిగ్జాం తుపానుతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. వ్యవసాయశాఖతో పాటు అన్ని శాఖల పరిధిలో తీవ్ర నష్టం జరిగింది. -
అధ్యక్షా మునిగాం
[ 07-12-2023]
శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నివాసముండే విజయనగరం జిల్లా కేంద్రంలోని 31 డివిజన్ పరిధిలో పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. -
బరువులెత్తి... పతకాలు పట్టి
[ 07-12-2023]
ఎక్కడో మారుమూల గ్రామస్థులు వారు.. అయితేనేం.. పట్టుబట్టి ఎంత బరువునైనా తలకెత్తగల సత్తా ఉంది. పల్లె ఖ్యాతిని విదేశీయుల గడ్డపై చాటి, పతకాలు బాటపట్టిన ఘటన సొంతమైంది. -
ఓటు నమోదుకు మూడు రోజులే గడువు
[ 07-12-2023]
కొత్త ఓటర్లుగా నమోదయ్యేందుకు మూడు రోజులే గడువుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కాసేపట్లో నగరానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు