AP News: నన్నెవరూ ఆపలేరు! ఓ అమాత్యుడి అనుచరుడి దందా
పర్చూరు నియోజకవర్గం నుంచి ఒంగోలుకు వచ్చిన ఈ వైకాపా నాయకుడు గత కొన్నేళ్లుగా ఓ కీలక ప్రజాప్రతినిధికి అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అదే ఆసరాగా సొంత ప్రపంచాన్ని...
‘నేను మోనార్క్ని.. నన్నెవరూ ఏమీ చేయలేరు’. అంటూ ఆయన సామాన్యులనే కాదు, అధికారులను సైతం బెంబేలెత్తిస్తుంటాడు. ఇటీవల ఓ వ్యక్తిపై జరిగిన దాడి ఉదంతంలోనూ అతను నిందితుడు. ఒంగోలు భాగ్యనగర్లో అతని వ్యవహారం నిత్యం చర్చనీయాంశమే. 20 నుంచి 30 మంది దాకా అక్కడ మద్యం సేవిస్తూనే ఉంటారు. వీరితో స్థానికులు పడే ఆవేదన అంతాఇంతా కాదు.. అసలే రౌడీగ్యాంగ్.. ఆ పై రాజకీయ నేపథ్యం ఉన్న ముఠా. దీంతో ఎవరికి వారు చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు. ఇదీ అధికార వైకాపాకు చెందిన ఓ ద్వితీయ శ్రేణి నాయకుడి దందా..
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: పర్చూరు నియోజకవర్గం నుంచి ఒంగోలుకు వచ్చిన ఈ వైకాపా నాయకుడు గత కొన్నేళ్లుగా ఓ కీలక ప్రజాప్రతినిధికి అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అదే ఆసరాగా సొంత ప్రపంచాన్ని సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ క్రమంలోనే ఒక్క ఒంగోలులోనే మూడు ప్రాంతాల్లో నివాసాలు అద్దెకు తీసుకున్నాడు. ఎవరికీ పైసా అద్దె కట్టడు. అదేమంటే నేత పేరు చెప్పి తీవ్రంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. భాగ్యనగర్లోని ఒక ప్లాట్లో అతను ప్రస్తుతం ఉంటున్నాడు. రోజూ అర్ధరాత్రి దాటేవరకు మందు పార్టీలు నడుస్తుంటాయి. ఇంటి యజమానికి కొన్నాళ్లుగా అద్దె చెల్లించడం లేదు. అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో ఆందోళనకు గురైన యజమాని తన ప్లాట్కు విద్యుత్తు బిల్లు చెల్లించడం మానేశారు. అధికారులు కనెక్షన్ తీసేశారు. ఆగ్రహించిన ఆ నాయకుడు అనధికారికంగా విద్యుత్తు కనెక్షన్ తీసుకున్నాడు. ఇది తెలిసి వచ్చిన సిబ్బందిని సైతం హెచ్చరించినట్లు తెలిసింది. నగరంలో మరో రెండు ప్రాంతాల్లోనూ సదరు నాయకుడు ఇదే దందా కొనసాగిస్తున్నాడు. రోజూ సుమారు 20 నుంచి 30 మంది వరకు యువకులకు మద్యం పోయించి బల ప్రదర్శన చేయిస్తుంటాడు. ఇక దందాలు సరేసరి. పోలీసులు అతని వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు. పోస్టింగులు సైతం వేయిస్తానంటూ వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల అధికార పార్టీకి సంబంధించి ఒంగోలులో జరిగిన ఓ సంచలన సంఘటనలో అతని పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. దీంతో తాజాగా ఇతర విషయాలు సైతం బయటకు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
[ 24-04-2024]
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. -
అన‘కొండలు’ తిన్న మన్ను.. రూ.860 కోట్లు
[ 24-04-2024]
తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి. -
ఇది కాదా.. జగన్నాటకం!
[ 24-04-2024]
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం. -
నామినేషన్ల వేళ మారిన పేర్లు
[ 24-04-2024]
నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. -
అరవీర ‘రంగు’ మార్తాండ
[ 24-04-2024]
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. -
క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
[ 24-04-2024]
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి
[ 24-04-2024]
పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. -
అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు
[ 24-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. -
తెదేపాలో చేరికల జోరు
[ 24-04-2024]
తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. -
కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
[ 24-04-2024]
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. -
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.