logo

ఆటో బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు

పనులకు వెళ్లి వస్తున్న మహిళల ఆటో బోల్తా పడటంతో తొమ్మిది మంది కూలీలు గాయపడిన సంఘటన సోమవారం మండలంలోని సాలిపేట వద్ద చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం.

Published : 18 Jan 2022 02:39 IST

గుడ్లూరు, న్యూస్‌టుడే: పనులకు వెళ్లి వస్తున్న మహిళల ఆటో బోల్తా పడటంతో తొమ్మిది మంది కూలీలు గాయపడిన సంఘటన సోమవారం మండలంలోని సాలిపేట వద్ద చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. రామాయపట్నం పల్లెపాలేనికి చెందిన రమణమ్మ, గాయత్రి, అంజమ్మ, నాగమ్మ, జాలమ్మ, శ్యామల, అలివేలు, సుబ్బమ్మ కర్లపాలెంలో ఉన్న రొయ్యల చెరువుల్లో కూలీ పనులకు వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. చోదకుడు రాఘవులు మలుపు వద్ద నియంత్రణ కోల్పోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. రాఘవ కూడా గాయపడ్డారు. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు.

కారు ఢీకొని ... : కనిగిరి, న్యూస్‌టుడే: ముందు వెళ్తున్న ఆటోను వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురికి గాయాలైన సంఘటన సోమవారం రాత్రి కనిగిరి పట్టణం కొత్తూరు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకాశం.. అడ్డరోడ్డు నుంచి కనిగిరికి వస్తున్న ఆటోను పామూరు నుంచి కనిగిరి వెళుతున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో వెనుక కూర్చుని ఉన్న శివయ్య మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.రామిరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని