కొవిడ్చికిత్సకు మూడంచెలు
కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో చికిత్స చేయడానికి జిల్లాలో మూడంచెల విధానం అవలంబించాలని నిర్ణయించారు. పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చిన ప్రతి ఒక్కరూ ఆసుపత్రుల్లో చేరితే భవిష్యత్తులో పడకల సమస్య తలెత్తుతుందని భావిస్తున్నారు. ప్రణాళికాబద్దంగా
జిల్లాలోని 49 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సౌకర్యం
జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కొవిడ్ కంట్రోల్ కేంద్రం
కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో చికిత్స చేయడానికి జిల్లాలో మూడంచెల విధానం అవలంబించాలని నిర్ణయించారు. పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చిన ప్రతి ఒక్కరూ ఆసుపత్రుల్లో చేరితే భవిష్యత్తులో పడకల సమస్య తలెత్తుతుందని భావిస్తున్నారు. ప్రణాళికాబద్దంగా బాధితులకు చికిత్స అందించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇప్పటికే జిల్లా అంతటా ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 49 ఆసుపత్రుల్లో సేవలందించడానికి నిర్ణయించారు.
న్యూస్టుడే, ఒంగోలు నగరం కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారికి, వారి సన్నిహితులకు తప్పనిసరిగా పరీక్షలు చేయాలని.. పాజిటివ్ వస్తే వారి లక్షణాలను వైద్యాధికారి తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు మూడంచెల పద్ధతి (ట్రయాజినింగ్) అనుసరిస్తున్నారు. తేలికపాటి జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటే హోం ఐసోలేషన్లో ఉండేలా సూచిస్తారు. ఇంటివద్ద అవకాశం లేని వారిని కొవిడ్ కేర్ కేంద్రాలకు సిఫార్సు చేస్తారు. జలుబు, దగ్గుతోపాటు అయిదు రోజులు జ్వరం తగ్గకుండా ఉన్నా, ఆక్సిజన్ శాతం తగ్గుతున్నా, ఊపిరాడని పరిస్థితి ఉన్నా ఆసుపత్రుల్లో చేర్చి పడక కేటాయించి ప్రత్యేక చికిత్స అందిస్తారు. అవసరాన్ని బట్టి ఆక్సిజన్ పడక, లేదా వెంటిలేటర్ మీదికి మారుస్తారు. ఈ విధంగా పాజిటివ్ కేసులను గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. కాగా ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల్లో స్వల్ప లక్షణాలు ఉంటున్నట్లు గుర్తించారు. సాధారణంగా ఈ వేరియంట్ను నిర్ధరణ చేసేందుకు హైదరాబాద్ లేదా విజయవాడ ల్యాబ్కు పంపి జీనోమ్ సీక్వెన్స్ పరీక్ష చేయించాలి. విదేశాల నుంచి వచ్చినవారిలో కొందరి నమూనాలు తీసి పంపిస్తున్నారు. మిగిలినవారికి లక్షణాలను బట్టి చికిత్స అందిస్తున్నారు.
ఈసారి సంఖ్య పెంచి..
కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన విషయం తెలిసిందే. గత రెండు దశల్లో దాదాపు 2 వేల మంది ఈ విధంగా సేవలు పొందారు. రెండోదశలో 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వగా ఈసారి 49 ఆసుపత్రులకు ఇచ్చారు. వాటిలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తూ భోజన ఏర్పాట్లు కూడా చేస్తారు. మొత్తం 49లో 19 ప్రభుత్వ ఆసుపత్రులు కాగా మిగిలినవి ప్రైవేటువి.. సోమవారం నాటికి 51 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఏడుగురు ఉండగా, మిగిలిన వారంతా జీజీహెచ్లో ఉన్నారు. అక్కడ ఇద్దరు ఆక్సిజన్ సాయంతో, మరొకరు వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లా అంతటా 986 క్రియాశీలక కేసులున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగానే ఉంటున్నాయి. ఈసారి సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో కూడా ఏర్పాట్లు చేసి వైద్యాధికారి, సిబ్బందిని నియమించారు.
ఒంగోలులోని జీజీహెచ్
ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రులివి:
ఒంగోలు జీజీహెచ్, మాతా శిశువైద్యశాల (ఇక్కడ చిన్నపిల్లలకు).. చీరాల, కందుకూరు, మార్కాపురం జిల్లా వైద్యశాల, పామూరు, కొండపి, కనిగిరి, పొదిలి, మార్టూరు, చీమకుర్తి, గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెం, ఉలవపాడు, దోర్నాల తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ వైద్యం అందిస్తారు.
ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలపై జిల్లా సమన్వయకర్త డాక్టర్ శ్రావణ్కుమార్ను సమాచారం కోరగా ట్రయాజినింగ్ చేశాక ఆసుపత్రుల్లో చికిత్స అవసరమైన వారిని చేర్చుకుంటారన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. మూడోదశలో ఇప్పటివరకు 40 మందిని ఆరోగ్యశ్రీ కింద నమోదు చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు