ఓటీసీ బాదుడు
ఆదాయ వనరుల కోసం పలు మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం ఏకకాల మార్పిడి (వన్టైమ్ కన్వర్షన్-ఓటీసీ)పై దృష్టిసారించింది. గతంలో పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రత్యేక డ్రైవ్ పేరుతో వసూలు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ
వ్యవసాయేతర నిర్మాణాల జాబితా సిద్ధం
ఈనాడు డిజిటల్, ఒంగోలు: ఆదాయ వనరుల కోసం పలు మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం ఏకకాల మార్పిడి (వన్టైమ్ కన్వర్షన్-ఓటీసీ)పై దృష్టిసారించింది. గతంలో పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రత్యేక డ్రైవ్ పేరుతో వసూలు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నవి, ఇప్పటి వరకు పన్ను చెల్లించనవి, భూ మార్పిడి జరిగినా పూర్తిస్థాయిలో చెల్లించనవి మూడు కేటగిరిలుగా విభజించి నోటీసులు జారీచేస్తున్నారు. వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్న భూమిలో పన్ను చెల్లించని వారి జాబితాను రెవెన్యూ అధికారులు తయారుచేశారు. ఇలా జిల్లా నుంచి దాదాపు రూ.25 కోట్లు రావాల్సి ఉంటుందని లెక్కకట్టారు. ఇప్పటికే రూ.కోటి వరకు వసూలైనట్లు సమాచారం.
ఎప్పుడు నిర్మాణం జరిగినా వర్తింపు
గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో చేపట్టిన వ్యవసాయేతర నిర్మాణాలకు నాలా పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో అలా ఎన్ని చేపట్టారు.. వాటికి సంబంధించి పన్ను, జరిమానా రూపంలో ఎంత మొత్తం వసూలు చేయాలన్నదానిపై కసరత్తు పూర్తయింది. వారి వివరాలు సేకరించి నోటీసులు అందజేస్తున్నారు. నిర్ణీత కాలపరిమితిలో క్రమబద్దీకరించుకోకపోతే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఎప్పుడు నిర్మాణం జరిగినా ఓటీసీ వర్తిస్తుందన్న ప్రభుత్వ ఆదేశాలు యజమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతేడాది జులై 29న ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పటివరకు 3 శాతంగా ఉన్న నాలా పన్నును 5 శాతానికి పెంచింది. మార్పిడి జరిగిన భూములకు విధించాల్సిన పన్నును పాత బకాయిదారులపై రుద్దుతున్నారని, 3శాతం వసూలు చేయాల్సిన చోట అపరాధరుసుము పేరుతో అధనంగా తీసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ ఏదోవిధంగా ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వం రకరకాల ఎత్తులు వేస్తోందన్నారు..
ప్రయోజనాలు ఉన్నాయి
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు చట్టబద్ధంగా పన్ను చెల్లించాలి. అలా కట్టకుండా సొంత నిర్ణయంతో వినియోగించుకుంటే అపరాధ రుసుము కట్టాల్సి ఉంటుంది. ఓటీసీ వల్ల తెలియకుండా భూమి కొనుగోలు చేసినవారికి క్రమబద్దీకరణ ఇబ్బందులు తొలుగుతాయి. ప్రభుత్వానికి చట్టబద్ధంగా రావాల్సిన పన్నులు వస్తాయి. ఈ డ్రైవ్ కొనసాగుతోంది. దీనికి నిర్దిష్ట సమయం ఇంకా నిర్ణయించలేదు. - వెంకటమురళి, జేసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
[ 24-04-2024]
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. -
అన‘కొండలు’ తిన్న మన్ను.. రూ.860 కోట్లు
[ 24-04-2024]
తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి. -
ఇది కాదా.. జగన్నాటకం!
[ 24-04-2024]
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం. -
నామినేషన్ల వేళ మారిన పేర్లు
[ 24-04-2024]
నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. -
అరవీర ‘రంగు’ మార్తాండ
[ 24-04-2024]
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. -
క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
[ 24-04-2024]
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి
[ 24-04-2024]
పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. -
అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు
[ 24-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. -
తెదేపాలో చేరికల జోరు
[ 24-04-2024]
తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. -
కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
[ 24-04-2024]
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. -
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.