గగనయానం..అయ్యేనా సాకారం
ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించడంతో జిల్లా వాసుల్లోని ఆకాంక్ష మరోసారి తెరపైకి వచ్చింది. పదేళ్ల క్రితం ఒంగోలు సమీపంలో అప్పటి ప్రభుత్వం
విమానాశ్రయం ఏర్పాటుపై ఆశలు
మూడు మండలాల్లో స్థల సేకరణపై దృష్టి
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించడంతో జిల్లా వాసుల్లోని ఆకాంక్ష మరోసారి తెరపైకి వచ్చింది. పదేళ్ల క్రితం ఒంగోలు సమీపంలో అప్పటి ప్రభుత్వం విమానాశ్రయం నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య సుమారు 3 వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. అనంతరం వాటిపై సాంకేతిక సమస్యలు నెలకొని ప్రతిపాదన ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ విమానాశ్రయం తెరపైకి వచ్చిన నేపథ్యంలో అద్దంకి, మార్టూరు, కొరిశపాడు మండలాలపై అధికారులు దృష్టిసారించారు.
వెయ్యి ఎకరాలు అవసరం
జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు స్వగ్రామాలకు వచ్చేటప్పుడు చెన్నై లేదా హైదరాబాద్లోని విమానాశ్రయంలో దిగేవారు. విజయవాడ సమీప గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి గుర్తింపు వచ్చాక ఇప్పుడు ఎక్కువమంది అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. గుంటూరుకు ఉత్తరం వైపున ఉన్న మండలాలకు గన్నవరం దగ్గర కానుంది. పైగా ప్రయాణికులకు షాపింగ్కు కూడా అనుకూలంగా ఉండనుండటంతో అక్కడికే వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వాసులతోపాటు, గుంటూరుకు దక్షిణం వైపున ఉన్న మండలాలకు అనుకూలంగా ఉండేలా విమానాశ్రయాన్ని జాతీయ రహదారి వెంబడి నిర్మిస్తే అనుకూలంగా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట ప్రాంత వాసుల రాకపోకలకు సైతం ఉపకరించేలా మార్టూరు, అద్దంకి, కొరిశపాడు ప్రాంతాల్లో స్థల సేకరణపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఆర్డీవో ప్రభాకర్రెడ్డి ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. బోయింగ్ విమానాలు సైతం ల్యాండింగ్ అయ్యేలా రన్వేను అభివృద్ధి చేసేందుకు మొత్తం వెయ్యి ఎకరాలు అవసరం కానున్నట్లు యంత్రాంగం భావిస్తోంది.
పరిహారం ఇచ్చి ..
విమానాల రాకపోకలు, ల్యాండింగ్ సమస్య వంటివి రాకుండా అధికారులు స్థలాలపై దృష్టిపెట్టారు. అద్దంకి సమీపంలో నామ్రోడ్డుకు పడమర వైపున కొంగపాడు, చక్రాయపాలెం గ్రామాల వద్ద; అద్దంకి-ముండ్లమూరు రోడ్డులో తిమ్మాయిపాలెం వద్ద సుమారు 1000 ఎకరాల ప్రైవేట్ భూములను రెవెన్యూ అధికారులు ఇప్పటికే పరిశీలించారు. ప్రభుత్వం అత్యవసరంగా భావిస్తే ల్యాండ్ పూలింగ్లో భాగంగా రైతులకు పరిహారం ఇచ్చి భూములు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మార్టూరు, కొరిశపాడు మండలాల్లోనూ చూస్తున్నారు. మార్టూరు నుంచి నాగరాజుపల్లె వరకు కొండ ప్రాంతం విస్తరించి ఉంది. అది తొలిచేందుకు భారీగా నిధులు అవసరం. పైగా పక్కన పొలాలను సేకరించాల్సి ఉంది. దీంతో పునరాలోచిస్తున్నారు. ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్రెడ్డి వద్ద ప్రస్తావించగా మూడు మండలాల్లో ముందస్తుగా అవసరమైన భూములను పరిశీలించాలని తహసీల్దార్లకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట