వాగులు పూడ్చి .. కాలువలు చదును చేసి...
జిల్లా కేంద్రానికి అత్యంత సమీప ప్రాంతం.. నాలుగు వరుసల రహదారిగా ఏర్పాటు కావడంతో పాటు దినదినాభివృద్ధి చెందుతుండటంతో ఒంగోలు- కర్నూలు రహదారిలోని భూములపై కొందరి కళ్లు పడ్డాయి. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉంచుతూ వచ్చిన భూముల్లోనూ
ఇష్టారీతిన కర్నూలు రహదారిలో వెంచర్లు
పంట కాలువ కట్టకు రెండు వైపులా చదును చేసిన భూములు
సంతనూతలపాడు, న్యూస్టుడే: జిల్లా కేంద్రానికి అత్యంత సమీప ప్రాంతం.. నాలుగు వరుసల రహదారిగా ఏర్పాటు కావడంతో పాటు దినదినాభివృద్ధి చెందుతుండటంతో ఒంగోలు- కర్నూలు రహదారిలోని భూములపై కొందరి కళ్లు పడ్డాయి. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉంచుతూ వచ్చిన భూముల్లోనూ ఇప్పుడు వెంచర్లు వెలుస్తున్నాయి. ఒంగోలు నుంచి పేర్నమిట్ట వరకు ఉన్న రహదారి వెంట ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది.
రాత్రికి రాత్రే చదును చేస్తూ...: కర్నూలు వెంట భూములు ఇప్పుడు ఖరీదైనవిగా మారాయి. రాత్రికి రాత్రే ఎర్రమట్టి తోలి భూములను చదును చేసే పనులు చేస్తున్నారు. వెంచర్లుగా ఏర్పాటు చేసి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. వీటిల్లో అనుమతులున్నవేవో అనేది కొనుగోలుదారులకు అర్థం కాని పరిస్థితి. రోడ్డు పక్కనున్న వ్యవసాయ భూములను గతంలోనే చాలా మంది కన్వర్షన్ చేసుకున్నారు. లోపలి వాటిని చేయలేదు. ఇప్పుడు రహదారికి దూరంలో ఉన్న పొలాలనూ చదును చేసి వెంచర్లు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. దీనిపై దృష్టిసారించాల్సిన రెవెన్యూ అధికారులు నామమాత్రపు పరిశీలనతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి.
వాగులు, కాలువలనూ వదలడం లేదు...: కర్నూలు రహదారి వెంట ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కాలువలు, వాగులను కూడా వదలకుండా చదును చేసి ప్లాట్లు ఏర్పాటు చేస్తుండటం ఇందుకు నిదర్శనం. సంతనూతలపాడు ఏఎంసీ కార్యాలయం సమీపంలో రహదారి వెంటనున్న కాలువను చదును చేశారు. దీనిపై కట్టడాలు చేపట్టేందుకూ సిద్ధమవుతున్నారు. ఎస్ఎస్ఎన్ కళాశాల సమీపంలో కొత్తగా నిర్మించిన రహదారి వెంట కొందరు సొంత స్థలంతో పాటు వాగును కూడా కలిపి చదును చేశారు. పేర్నమిట్టలోని చెరువు కట్ట సమీపంలో రహదారి అంచులనూ వదలకుండా ఎర్రమట్టి తోలి చదును చేశారు. ఈ విషయమై తహసీల్దార్ రామానాయుడు మాట్లాడుతూ.. వ్యవసాయ భూముల్లో ప్లాట్లు ఏర్పాటు చేయాలంటే అనుమతులు తప్పనిసరి అని చెప్పారు. కర్నూలు రహదారి వెంట వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారిలో కొందరు అనుమతులు పొందగా.. మరికొందరు ఇంకా దరఖాస్తు చేయలేదని తెలిపారు. అటువంటి వాటిని పరిశీలించి నోటీసులు జారీ చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
[ 24-04-2024]
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. -
అన‘కొండలు’ తిన్న మన్ను.. రూ.860 కోట్లు
[ 24-04-2024]
తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి. -
ఇది కాదా.. జగన్నాటకం!
[ 24-04-2024]
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం. -
నామినేషన్ల వేళ మారిన పేర్లు
[ 24-04-2024]
నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. -
అరవీర ‘రంగు’ మార్తాండ
[ 24-04-2024]
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. -
క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
[ 24-04-2024]
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి
[ 24-04-2024]
పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. -
అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు
[ 24-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. -
తెదేపాలో చేరికల జోరు
[ 24-04-2024]
తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. -
కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
[ 24-04-2024]
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. -
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్