logo

కోటయ్య కుటుంబానికి ఆర్థిక సాయం

పట్టణంలోని ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్‌ చలంచర్ల కోటయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని శనివారం తెదేపా నాయకుడు ఇంటూరి నాగేశ్వరరావు పరామర్శించి రూ.10 వేలు ఆర్థికసాయం అందించారు. అనంతరం రెండో

Published : 23 Jan 2022 03:31 IST


నగదు అందజేస్తున్న నాగేశ్వరరావు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్‌ చలంచర్ల కోటయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని శనివారం తెదేపా నాయకుడు ఇంటూరి నాగేశ్వరరావు పరామర్శించి రూ.10 వేలు ఆర్థికసాయం అందించారు. అనంతరం రెండో వార్డు తెదేపా అధ్యక్షుడు ఖాదర్‌బాషా సతీమణి మహబూబ్‌జాన్‌ వైద్య ఖర్చుల కోసం వారికి రూ.10 వేలు అందజేశారు. 32వ వార్డులో అనారోగ్యంతో బాధపడుతున్న గుర్రం బ్రహ్మయ్య, కొర్లపాటి రమణయ్యలకు రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మల్లేశ్వరరావు, టి.ప్రసాద్‌, ఎం.వేణు, సీహెచ్‌.మధు, షేక్‌ సలాం, బి.ఆదెమ్మ, ఎన్‌.మురళి, ముచ్చు వేణు, కె.రవి, ప్రసాద్‌, కూనం నరేంద్ర, మహేంద్ర, బి.మాల్యాద్రి, ముసలయ్య, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని