logo

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

ప్రభుత్వ పథకాలు అర్హులైనవారందరికీ అందించేందుకు అందరూ కృషిచేయాలని కమిషనర్‌ సీహెచ్‌ మల్లేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్‌ సమావేశ మందిరంలో మోగా గ్రౌండింగ్‌ మేళా, ఓటీఎస్‌కు సంబంధించి ఆయా శాఖల

Published : 23 Jan 2022 03:31 IST


సమీక్షా సమావేశంలో పాల్గొన్న అధికారులు, వివిధ శాఖల సిబ్బంది

చీరాల పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలు అర్హులైనవారందరికీ అందించేందుకు అందరూ కృషిచేయాలని కమిషనర్‌ సీహెచ్‌ మల్లేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్‌ సమావేశ మందిరంలో మోగా గ్రౌండింగ్‌ మేళా, ఓటీఎస్‌కు సంబంధించి ఆయా శాఖల సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌తోపాటు హౌసింగ్‌ డీఈ మాధవరావు తదితరులు మాట్లాడారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 25వతేదీన ఓటీఎస్‌ మేళను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆయా కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని