logo

నగరంలో కార్పొరేషన్‌ ఛైర్మన్లు

జిల్లా పర్యటనలో భాగంగా మాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పెదపాటి అమ్మాజీ, మాదిగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మూరి కనకారావు, రెల్లి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌ శనివారం ఒంగోలు నగరానికి వచ్చారు. స్థానిక ఎన్నెఎస్పీ అతిథి గృహంలో బస చేశారు. వీరిని

Published : 23 Jan 2022 03:31 IST


ఛైర్మన్లతో చర్చిస్తున్న ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస్‌ విశ్వనాథ్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా పర్యటనలో భాగంగా మాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పెదపాటి అమ్మాజీ, మాదిగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మూరి కనకారావు, రెల్లి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌ శనివారం ఒంగోలు నగరానికి వచ్చారు. స్థానిక ఎన్నెఎస్పీ అతిథి గృహంలో బస చేశారు. వీరిని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎన్‌.లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస్‌ విశ్వనాథ్, దళిత సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. స్థానిక ప్రగతి భవన్‌లో ఆదివారం నిర్వహించనున్న సమావేశానికి హాజరుకానున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని