ఇసుక కొరతతో ఇక్కట్లు
ఇసుక కొరత నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నియోజకవర్గ కేంద్రాలలో ఇసుక నిల్వ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినా ప్రజలకు సక్రమంగా అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అభివృద్ధి పనులకు ఆటంకం
అదనపు వసూళ్లపై ఫిర్యాదులు
పర్చూరు యార్డులో ఖాళీగా ఉన్న ఇసుక నిల్వ కేంద్రం
పర్చూరు, న్యూస్టుడే : ఇసుక కొరత నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నియోజకవర్గ కేంద్రాలలో ఇసుక నిల్వ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినా ప్రజలకు సక్రమంగా అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పర్చూరు యార్డు ప్రాంగణంలో ఇసుక నిల్వ కేంద్రం ఏర్పాటు చేశారు. పర్చూరు, చీరాల నియోజకవర్గ కేంద్రాల పరిధిలోని గ్రామాలకు ఇక్కడ నుంచి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇసుక నిల్వ సరిపడినంత లేని కారణంగా గత 3 నెలలుగా ప్రైవేటు వ్యక్తులకు ఇసుక సరఫరా చేయడం లేదు. కేవలం ప్రభుత్వ గృహాలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. టన్ను రూ.885లు చొప్పున ప్రైవేటు వ్యక్తుల నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ గృహాల నిర్మాణానికి మాత్రం ఉచితంగా సరఫరా చేయాలి. గృహనిర్మాణశాఖ అధికారులు ఇసుక అవసరానికి సంబంధించి లబ్ధిదారులకు స్లిప్పులు జారీ చేస్తారు. వాటిని పర్చూరు యార్డు లోని నిల్వ కేంద్రంలో అందజేస్తే ఇసుక లోడింగ్ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీ ప్రతినిధులపై ఉంది. రవాణా ఖర్చు లబ్ధిదారులే భరించాలి. ఈనెల 19వ తేదీన గృహనిర్మాణ లబ్ధిదారుల నుంచి అదనంగా రూ.500లు వసూలు చేస్తున్నారు.
వివాదాస్పదం : రెండేళ్ల క్రితం యార్డు ప్రాంగణంలో ఒక మూలన నిల్వ చేసిన నాణ్యతలేని మట్టి శాతం అధికంగా ఉన్న ఇసుకను గృహనిర్మాణ లబ్ధిదారులకు ఇచ్చారు. దీనికి కూడా ట్రాక్టర్కు లోడింగ్కు రూ.500లు చొప్పున లబ్ధిదారుల నుంచి వసూలు చేయడం వివాదాస్పదమైంది. లబ్ధిదారుల ఫిర్యాదుపై గృహనిర్మాణశాఖ డీఈ ఎన్.మురళి ఇసుక కేంద్రాన్ని సందర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేయడంపై ఏజెన్సీ ప్రతినిధిని ప్రశ్నించారు. సమస్యను సంయుక్త కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అదనపు వసూలు ఆపేశారు. మట్టి శాతం అదనంగా ఉన్న ఇసుకను తీసుకోవాల్సిన అవసరం లేదని గృహనిర్మాణశాఖ అధికారులు లబ్ధిదారులకు సూచించారు. ఇసుక కొరత కారణంగా గృహ నిర్మాణాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.
అనూహ్యంగా పెరిగింది : పర్చూరు నిల్వ కేంద్రంలో ఇసుక లేకపోవడంతో పర్చూరు, చీరాల నియోజక వర్గాల్లోని ఇళ్ల నిర్మాణంతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల సకాలంలో పనులు జరగడంలేదని పనులు చేపట్టిన వారు వాపోతున్నారు. ప్రభుత్వం టన్ను రూ.885లకు సరఫరా చేస్తుండగా అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులకు ఇదే ధరకు సరఫరా చేస్తున్నారు. అమరావతి, తదితర ప్రాంతాల నుంచి ప్రైవేటు వ్యక్తులు ఇసుక తెప్పించుకుంటున్నారు. 30 టన్నుల లారీ రూ.27 వేలకు ఇంటికి చేరుతున్నట్లు చెబుతున్నారు. దీనిని పరిశీలిస్తే ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఇసుక తక్కువ ధరకు రావడం లేదనేది స్పష్టమవుతోంది. ఇసుక ధర అనూహ్యంగా పెంచడంతో పాటు పలు రకాల నిబంధనల కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక కొరతపై ఉన్నతాధికారులు దృష్టి సారించి నాణ్యమైన ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో