వైద్యం అందించే నాథుడే కరవు
ఓ ప్రజాప్రతినిధి ప్రమాదానికి గురై వైద్యసాయం కోసం అర్థించాల్సిన దుస్థితి శనివారం మార్టూరు కమ్యూనిటీ హెల్త్ కేంద్రంలో చోటుచేసుకుంది. ద్రోణాదులకు చెందిన సర్పంచి వంకాయలపాటి భాగ్యారావు, పల్లెపోగు జాన్వెస్లీలు ద్విచక్రవాహనం పై వస్తుండగా జొన్నతాళి కూడలి
రిజిష్టర్ను పరిశీలిస్తున్న జడ్పీ ఉపాధ్యక్షురాలు సుజ్ఞానమ్మ
మార్టూరు, న్యూస్టుడే: ఓ ప్రజాప్రతినిధి ప్రమాదానికి గురై వైద్యసాయం కోసం అర్థించాల్సిన దుస్థితి శనివారం మార్టూరు కమ్యూనిటీ హెల్త్ కేంద్రంలో చోటుచేసుకుంది. ద్రోణాదులకు చెందిన సర్పంచి వంకాయలపాటి భాగ్యారావు, పల్లెపోగు జాన్వెస్లీలు ద్విచక్రవాహనం పై వస్తుండగా జొన్నతాళి కూడలి వద్ద ట్రాక్టర్ ఢీ కొనడంతో గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ భాగ్యారావు వైద్యసేవలకు మార్టూరు లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. ఆ సమయంలో చిన్నపిల్లల వైద్యుడు మాత్రమే ఉన్నారు. ప్రాథమిక వైద్యం అందించేందుకు నర్సులు శ్రమించాల్సి వచ్చింది. 30 పడకల వైద్యశాలలో ఒక్క డాక్టరే ఉండటం, ప్రజాప్రతినిధికి కనీస వైద్య సేవలు అందని విషయం తెలుసుకున్న జడ్పీ ఉపాధ్యక్షురాలు చుండి సుజ్ఞానమ్మ, పలువురు వైకాపా నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్ను, సిబ్బందిని నిలదీశారు. కనీస సేవలు అందించకుండా ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు రెఫర్ చేయడాన్ని ఆక్షేపించారు. కొవిడ్ సేవలందించే ప్రత్యేక హాల్ ఉన్నప్పటికీ వారికి వైద్యసాయం అందించే సిబ్బంది కాని, నిపుణులు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విధులకు డుమ్మా కొడుతున్న వైద్యులు, సిబ్బందిపై జిల్లా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
రేపటి సంతకం కూడా నేడే : మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు జడ్పీ ఉపాధ్యక్షురాలు సుజ్ఞానమ్మ పరిశీలనతో తేటతెల్లమైంది. ఆసుపత్రిలో వైద్యం అందటం లేదని పలువురు రోగులు ఆమె ముందు ఆవేదన వ్యక్తం చేయగా, కార్యాలయంలోని రిజిష్టర్ను తెప్పించి అందరి ముందు పరిశీలించారు. అందులో కొంత మంది ఉద్యోగులు రేపటి రోజు (23వతేదీ )విధులకు హాజరైనట్లు ముందే సంతకం పెట్టి ఉండటం చూసి విస్తుపోయారు. మొత్తం 24 మంది ఉద్యోగులు ఆ శాఖలో పని చేస్తుండగా 13 మంది హాజరైనట్లు రిజిష్టర్లో నమోదై ఉంది. 8 మంది సంతకాలు లేకుండా దస్త్రాల్లో ఖాళీ ఉంది. అయితే విధుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని