పిల్లలూ... తగ్గాలి జోరు
జిల్లాలో ఇటీవల మైనర్లు ఎక్కడ చూసినా రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నారు. వాహనం నడిపేందుకు తగిన వయసు లేకుండానే తీసేస్తున్నారు. తెలిసీ తెలియని వయస్సులో తల్లిదండ్రులు పిల్లలకు ద్విచక్ర వాహనాలు నేర్పించడం...వెంటనే వారే స్వయంగా నడిపేలా
ఒంగోలు వంటవారి కాలనీకి చెందిన కె.రవికిరణ్(13) నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.. పీవీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివే ప్రభాకర్ స్నేహితుడు. ఈనెల 17న ఓ ద్విచక్రవాహనంపై ఇద్దరూ హైదరాబాద్ బయలుదేరారు. అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద విభాగినిని వీరి వాహనం ఢీకొట్టింది. రవికిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్కు తీవ్ర గాయాలయ్యాయి. సరదా కోసం వారు చేసిన చిన్న తప్పిదం కుటుంబాల్లో చీకట్లను మిగిల్చింది. కనిగిరి పట్టణంలోనూ రెండు నెలల క్రితం ఇద్దరు బాలురు వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయారు.
మార్కాపురం గడియార స్తంభం న్యూస్టుడే: జిల్లాలో ఇటీవల మైనర్లు ఎక్కడ చూసినా రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నారు. వాహనం నడిపేందుకు తగిన వయసు లేకుండానే తీసేస్తున్నారు. తెలిసీ తెలియని వయస్సులో తల్లిదండ్రులు పిల్లలకు ద్విచక్ర వాహనాలు నేర్పించడం...వెంటనే వారే స్వయంగా నడిపేలా ప్రోత్సహించడం ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, వారికి తెలియకుండానో బండిని తీసుకెళ్లడంతో తరచూ ఎక్కడో చోట పిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు. కొంత మందికి గాయాలు కాగా మరికొంతమంది శాశ్వత వైకల్యంతో ఇబ్బందిపడుతున్నారు. స్థానిక పోలీసులు, రవాణాశాఖ అధికారులు జరిమానాలు విధించడం, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించడం చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడంలేదు. పిల్లలకు వాహనం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మైనర్లకు బండిస్తే తల్లిదండ్రులదే బాధ్యత
నిబంధనల ప్రకారం నిర్ణీత 18 ఏళ్లు దాటని వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా వాహనం నడిపేందుకు వీలులేదు. ఇలా నడిపితే తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత. పిల్లలపై పెద్దలు నిరంతర నిఘా ఉంచాలి.తగిన వయస్సు వచ్చేంత వరకు పొరపాటున కూడా వారికి డ్రైవింగ్ నేర్పించకూడదు. చాలా మంది చిన్నతనంలోనే ఖరీదైన వాహనాలు ఇప్పిస్తుండటంతోనే అధికశాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో తనతో పాటు ఎదుటివారికి హాని కలిగిస్తున్నారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. -కరుణాకరణ్, ఎంవీఐ, మార్కాపురం యూనిట్
కఠిన చట్టాలున్నా.....
* మోటారు వాహనాల చట్టం ప్రకారం 18 ఏళ్లు వయస్సు గల వారు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హులు. రవాణాశాఖ అధికారులు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికే మాత్రమే దీనిని మంజూరు చేస్తారు.
* అనుమతిలేని వారికి వాహనం ఇస్తే ఎంవీ యాక్టు 1988లోని సెక్షన్ 3 ఉల్లంఘన కింద మొదటిసారి రూ.5 వేలు జరిమానా ఉంటుంది. మళ్లీ అదే తప్పు చేసి పట్టుబడితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానిపై కేసు నమోదు చేస్తారు. దీనిపై బాధ్యులైనవారికి మూడు నెలల శిక్ష ఉంటుంది.
* డ్రైవింగ్ లైసెన్స్కు అర్హతలేని వారికి వాహనం ఇస్తే సెక్షన్ 182(1) ప్రకారం రూ.10 వేల జరిమానా పడుతుంది.
* నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాన్ని మార్పులు చేసిన వారిపై సెక్షన్ 182ఏ(1) కింద రూ.లక్ష జరిమానా విధిస్తారు.
* ప్రమాదకరంగా వాహనం నడుపుతూ ఎదుటివారికి హాని కలిగిస్తే సెక్షన్ 186 కింద మొదటి సారి రూ.2 వేలు రెండోసారి రూ.10 వేలు విధిస్తారు.
* మూడు సార్లకు మించి వాహనం పట్టుబడితే జప్తు చేసేందుకు సంబంధితశాఖ అధికారులకు పూర్తి బాధ్యత కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ