తగ్గేదే లేదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఒంగోలు నగరంలోని ఎన్జీవో హోంలో జిల్లాలోని అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు శరత్బాబు
25న మూడు వేల మందితో మహాధర్నా
ఉద్యమ సన్నద్ధ సమావేశంలో నాయకులు
మాట్లాడుతున్న ఏపీ ఎన్జీవో నాయకుడు శరత్బాబు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఒంగోలు నగరంలోని ఎన్జీవో హోంలో జిల్లాలోని అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు శరత్బాబు మాట్లాడారు. రాష్ట్ర పీఆర్సీ సాధన సమితి నిర్ణయం మేరకు దశల వారీగా ప్రకటించిన అన్ని రకాల ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేయాలని కోరారు. అధికారుల కమిటీ సిఫార్సులు రద్దు చేయడంతో పాటు, అశుతోష్ మిశ్రా నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలన్నారు. ఐఆర్ 27 శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలని, పాత హెచ్ఆర్ఏ స్లాబులను కొనసాగించాలని, కేంద్ర పే కమిటీ స్కేల్స్ అమలు చేయొద్దని, రాష్ట్ర పే కమిషన్ను యధాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 25న ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద మూడు వేల మందితో మహాధర్నా చేయనున్నట్టు తెలిపారు. 26న అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాలు; 27 నుంచి 30 వరకు రిలే నిరాహార దీక్షలు, ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పలు సంఘాల నాయకులు విమర్శలు గుప్పించారు. సమావేశంలో జిల్లాలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు
పెంచకుండా తగ్గింపు తగదు...
ఉద్యోగులతో సంప్రదింపులు చేపట్టకుండా పీఆర్సీ ఉత్తర్వులు ఇచ్చారు. చీకటి జీవోలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. ఐఆర్ 27 శాతం ఉంటే పీఆర్సీ 23 శాతం ఇచ్చారు. తక్కువ ఉండటం ఇదే ప్రథమం. గతంతో పోలిస్తే అద్దెలు పెరుగుతున్నాయి. అలాంటిది హెచ్ఆర్ఏ పెంచాల్సింది పోయి.. తగ్గించడం ఏమిటి? పాత హెచ్ఆర్ఏ స్లాబులను కొనసాగించాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీరించాలి. - వై.చిట్టిబాబు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా ఛైర్మన్
పాదయాత్ర హామీ నెరవేర్చాలి...
అధికారుల కమిటీ సిఫార్సులు రద్దు చేయడంతో పాటు, అశుతోష్ మిశ్రా నివేదికను బహిర్గత పరిచి అమలు చేయాలి. ఐఆర్ 27 శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలి. పాత హెచ్ఆర్ఏ స్లాబులను కొనసాగించాలి. రాష్ట్ర పే కమిషన్ యధాతథంగా అమలు చేయాలి. జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ పేస్కేల్స్ వర్తింపజేయాలి. - కృష్ణమోహన్, ఏపీ ఐకాస అమరావతి జిల్లా ఛైర్మన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం