బిడ్డా..ఇది నా అడ్డా...
ఇద్దరు డీఎస్పీలు.. ఇద్దరు సీఐలు.. అదనంగా ఎస్సైలు.. ఒక్కటంటే ఒక్కటే ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్. ఉదయం 11 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎడతెగని పంచాయితీ. చివరికి పట్టుకున్న ట్రాక్టర్ను పోలీసు స్టేషన్కు తరలించలేకపోయారు.
ప్రభుత్వం మాది.. మాట వినాలి మీరు
అధికారులపై ఇసుక మాఫియా జులుం
గ్రామంలో పర్యటిస్తున్న ఒంగోలు పోలీసు,
సెబ్ డీఎస్పీలు నాగరాజు, సుధీర్బాబు
ఇద్దరు డీఎస్పీలు.. ఇద్దరు సీఐలు.. అదనంగా ఎస్సైలు.. ఒక్కటంటే ఒక్కటే ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్. ఉదయం 11 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎడతెగని పంచాయితీ. చివరికి పట్టుకున్న ట్రాక్టర్ను పోలీసు స్టేషన్కు తరలించలేకపోయారు. ఇసుకను అక్కడే వదిలేసి ట్రాక్టర్ను అప్పగించేసి తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన కొత్తపట్నం మండలం మడనూరులో ఆదివారం చోటుచేసుకుంది.
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: మడనూరులో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు సెబ్ సీఐ లతకు సమాచారం అందింది. దీంతో ఆమె సిబ్బందితో ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఒక వ్యక్తి ఏపీ 27 టీజీ 2957 నెంబర్ ట్రాక్టర్లో ఇసుక నింపుకొని వస్తుండగా సెబ్ సీఐ లత ఆధ్వర్యంలో సిబ్బంది అడ్డుకున్నారు. అంతే ఒక్కసారిగా అక్కడి పరిస్థితి మారిపోయింది. ‘నేనిక్కడ అధికార పార్టీ నాయకుడ్ని. ఇక్కడెవరైనా నా మాట వినాల్సిందే. ఈ మండలంలో ఎవరి ట్రాక్టర్లను పోలీసులు ఆపినా నేను పంచాయితీ చేస్తుంటా. చివరికి నా ట్రాక్టర్నే ఆపేస్తే తర్వాత నా పరిస్థితేంటి’ అంటూ సంబంధిత యజమాని ప్రమోద్రెడ్డి తన అనుచరులతో కలిసి సెబ్ అధికారులు, సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితిని ఉన్నతాధికారులకు సిబ్బంది వివరించారు.
డీఎస్ఫీ. వచ్చినప్పటికీ..: విషయం తెలుసుకున్న సెబ్ డీఎస్పీ సుధీర్బాబు అక్కడికి చేరుకుని ట్రాక్టర్ను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చేసేదేమీ లేక రెండో పట్టణ సీఐ రాఘవరావుకు సమాచారం ఇచ్చారు. సీఐతో పాటు కొత్తపట్నం ఎస్సై ఫిరోజ్ ఫాతిమా సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని చర్చలు సాగించారు.
ఏమీ చేయలేక.. ఎటూ పాలుపోక...: ఇటు పోలీసులు, అటు సెబ్ అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పట్టుకున్న ట్రాక్టర్లో ఉన్న ఇసుకను ఓ ఖాళీ స్థలంలో పోయించారు. ఆ తర్వాత ట్రాక్టర్ను సంబంధిత యజమానికి అప్పగించేసి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఉదంతంపై సెబ్ సీఐ లత కొత్తపట్నం పోలీసు స్టేషన్లో ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభమైన ఈ పంచాయితీ ఆదివారం రాత్రి సుమారు తొమ్మిది గంటల వరకు కొనసాగడం గమనార్హం. ఈ విషయమై ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు మాట్లాడుతూ.. సెబ్ అధికారులు ఇసుకను తరలించే ట్రాక్టర్ను పట్టుకుంటే స్థానికులు అడ్డుకున్నట్టు చెప్పారు. సెబ్ అధికారుల ఫిర్యాదుతో తాము అక్కడికి వెళ్లామని.. ఊరంతా అక్కడే ఉండటంతో ఏమీ చేయలేక వెనుదిరిగి వచ్చినట్టు తెలిపారు. కేసు నమోదు చేశామని.. సమగ్రంగా దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇసుక ట్రాక్టర్ను తీసుకెళ్లకుండా గుమికూడిన మడనూరు వాసులు
పట్టుకున్న ట్రాక్టర్లోని ఇసుకను ఖాళీ స్థలంలో పారబోయిస్తున్న దృశ్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ