logo

బస్సు ఢీకొని దుప్పి మృతి

పెద్దదోర్నాల-శ్రీశైలం ఘాట్‌ రోడ్డులోని ఎకో టూరిజం సమీపంలో బస్సు ఢీకొని చుక్కల దుప్పి మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. దోర్నాల రేంజర్‌ విశ్వేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు

Published : 24 Jan 2022 05:19 IST

కళేబరాన్ని పరిశీలిస్తున్న రేంజర్‌ విశ్వేశ్వరరావు, సిబ్బంది

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: పెద్దదోర్నాల-శ్రీశైలం ఘాట్‌ రోడ్డులోని ఎకో టూరిజం సమీపంలో బస్సు ఢీకొని చుక్కల దుప్పి మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. దోర్నాల రేంజర్‌ విశ్వేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఎకోటూరిజం సమీపంలో రోడ్డు దాటుతున్న చుక్కల దుప్పిని ఢీకొట్టింది. దీంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. దోర్నాల అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద సిబ్బంది బస్సును అడ్డగించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దుప్పి కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని