చదువులు భారమంటూ అదృశ్యం
పాఠశాలలో ఉపాధ్యాయులు హోంవర్క్ (ఇంటి పని) ఎక్కువ ఇస్తున్నారంటూ ఓ విద్యార్థిని ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం సోమవారం కలకలం రేపింది. మధ్యాహ్నానికి ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలికా దినోత్సవం రోజున చోటుచేసుకున్న
బస్సులో బాలికతో మాట్లాడుతున్న ఎస్సై మల్లికార్జున
పాఠశాలలో ఉపాధ్యాయులు హోంవర్క్ (ఇంటి పని) ఎక్కువ ఇస్తున్నారంటూ ఓ విద్యార్థిని ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం సోమవారం కలకలం రేపింది. మధ్యాహ్నానికి ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలికా దినోత్సవం రోజున చోటుచేసుకున్న ఈ ఉదంతం కందుకూరు డివిజన్ పోలీసులను కొద్దిసేపు పరుగులు పెట్టించింది. సీఐ శ్రీరామ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కందుకూరు పట్టణ పరిధిలోని వెంకటాద్రిపాలేనికి చెందిన విద్యార్థిని పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం నిద్ర లేచి బ్యాగ్లో దుస్తులు ఉంచుకుని బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లింది. పాఠశాలకు వెళ్లకపోవడం.. ఇంటికీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. పట్టణ, గ్రామీణ ఎస్సైలు జీవీ.చౌదరి, కిషోర్బాబు వెంటనే స్పందించారు. పట్టణంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్, ఆటో స్టాండ్, పాఠశాలల వద్ద గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో అందరిలోనూ ఆందోళన పెరిగింది. చివరికి మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో ఓ వ్యక్తి కందుకూరు నుంచి కావలి వెళ్లే బస్సులో బాలిక ఉన్నట్టు తెట్టు వద్ద తాను చూశానని ఫోన్ ద్వారా పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న గుడ్లూరు ఎస్సై మల్లికార్జున.. బస్సును అనుసరించి చేవూరు మద్దూరుపాడు వద్ద నిలిపి తనిఖీ చేశారు. బాలికను గుర్తించి గుడ్లూరు స్టేషన్కు తీసుకొచ్చారు. తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి మాట్లాడారు. పాఠశాలలో హోంవర్క్(ఇంటిపని) ఎక్కువగా ఇస్తుండటంతో ఒత్తిడి భరించలేక.. కావలిలో ఉండే అత్తమ్మ ఇంటికి వెళ్తున్నట్టు బాలిక వారికి తెలిపింది. - న్యూస్టుడే, గుడ్లూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు