రోజు రోజుకూ వైరస్ ఉద్ధృతం
కరోనా వైరస్ జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతమవుతోంది. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలనూ చుట్టుముడుతోంది. మూడో విడత కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఐఏఎస్ల నుంచి అటెండర్ల వరకు పలువురు
చుట్టుముడుతున్న మహమ్మారి
పోలీసు శాఖ, పాఠశాలల్లోనూ కలకలం
పర్చూరు మండలం వీరన్నపాలెంలోని ఓ వీధిలో ఏర్పాటు చేసిన కట్టడి జోన్
ఒంగోలు నేరవిభాగం, ఒంగోలు నగరం- న్యూస్టుడే కరోనా వైరస్ జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతమవుతోంది. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలనూ చుట్టుముడుతోంది. మూడో విడత కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఐఏఎస్ల నుంచి అటెండర్ల వరకు పలువురు అధికారులు, ఉద్యోగులు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు జిల్లా పోలీసు శాఖలోనూ కలకలం రేపుతోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఇందుకు కారణం. వ్యాప్తి చెందకుండా పోలీసు స్టేషన్లతో పాటు కార్యాలయాల వద్ద పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. పలువురు వైరస్ బారిన పడుతుండటం అధికారులు, సిబ్బందిని కలవరపాటుకు గురిచేస్తోంది.
స్పందనకు అంతరాయం...
వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో జిల్లా పోలీసు కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ముఖాముఖిగా కాకుండా వర్చువల్ విధానానికి ఇప్పటికే మార్చారు. ఈ సోమవారం ఆ కార్యక్రమం కూడా పూర్తిస్థాయిలో నిర్వహించలేదు. సబ్ డివిజన్ కేంద్రాల నుంచి డీఎస్పీలు, జిల్లా కేంద్రంలో సీఐ ఒకరు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
150 మంది వరకు బాధితులు...
జిల్లాలో ఇప్పటికి సుమారు 150 మంది అధికారులు, సిబ్బంది కరోనాతో బాధపడుతున్నారు. వీరితో పాటు పోలీసు కుటుంబాల నుంచి సుమారు 60 మందికి పైగా వైరస్ సోకింది. గ్రామ, వార్డు స్థాయిలో పనిచేస్తున్న మహిళా పోలీసులు సుమారు 25 మంది వైరస్ బారినపడ్డారు. కొందరు హోం ఐసోలేషన్లో ఉండగా, మరికొందరు వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వారితో మాట్లాడుతూ.. ఆత్మస్థైర్యం కల్పిస్తున్నారు. ఈపాటికే జిల్లా ఎస్పీ మలికా గార్గ్ జిల్లాలోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి కరోనా నేపథ్యంలో అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కొవిడ్ కేర్ సెంటర్ ద్వారా బాధితుల వివరాలు సేకరించి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
చీరాల ఏరియా ఆసుపత్రిలో కొవిడ్ పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
89 మంది ఉపాధ్యాయులు.. 9 మంది విద్యార్థులు...
జిల్లాలో సోమవారం 1597 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఒంగోలులో 432, అద్దంకిలో 180, మార్టూరులో 75 కేసులు వెలుగుచూశాయి. దీంతో 7504 మంది వ్యాధితో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలల్లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం 89 మంది ఉపాధ్యాయులు, 9 మంది విద్యార్థులు, 86 మంది బోధనేతర సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. పాఠశాలల్లో ఒక్కరోజులోనే 184 కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఒంగోలు ఆర్డీవో, ఎస్డీసీకు కరోనా
ఒంగోలు గ్రామీణం: ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్రెడ్డితో పాటు, ఆయన కారు డ్రైవర్ కోటిరెడ్డి, సహాయకుడు కొండయ్య, కార్యాలయంలోని ఉప తహసీల్దార్ మురళి, సీనియర్ అసిస్టెంట్ మేరి కరోనా బారిన పడ్డారు. కేఆర్ఆర్సీ ఎస్డీసీ ఎం.శ్రీదేవికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. దీంతో వారందరూ హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.
కొవిడ్ ఆర్థిక సాయానికి దరఖాస్తులివ్వాలి
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేయనుంది. ఇందులో భాగంగా ఇంకా ఎవరికైనా సాయం అందకుంటే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జత చేసి కలెక్టరేట్లోని కొవిడ్ కంట్రోల్ రూం లేదా తహసీల్దార్ కార్యాలయంలోనైనా స్వయంగా ఇవ్వాలని ఆయన సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే