పిడికిలి బిగించి.. పీఆర్సీపై ఉద్యమించి..
గిద్దలూరు పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎన్జీవో సంఘం స్థానిక అధ్యక్షుడు టి.నరేష్, ఏపీజీఏ అధ్యక్షుడు వై.పి.రంగయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.రవీంద్రనాథరెడ్డి, యూటీఎఫ్ సంఘం
పొదిలి : అంబేడ్కర్ విగ్రహం వద్ద ...
పీఆర్సీ రద్దు చేసే వరకూ వెన్నుచూపేది లేదని ఉద్యోగ సంఘాలు నినదిస్తున్నాయి. పిడికిలి బిగించి పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉద్యోగులు తమ తమ నిరసనలు కొనసాగించారు.
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే : గిద్దలూరు పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎన్జీవో సంఘం స్థానిక అధ్యక్షుడు టి.నరేష్, ఏపీజీఏ అధ్యక్షుడు వై.పి.రంగయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.రవీంద్రనాథరెడ్డి, యూటీఎఫ్ సంఘం నాయకుడు రంగారెడ్డి, ఏపీటీఎఫ్ నాయకుడు యల్లా శ్రీనివాసులు, ఆర్టీసీ సంఘం నాయకులు చక్రపాణి యాదవ్, పగిడి రమేష్బాబు రెడ్డి పాల్గొన్నారు.
కంభం: ఉపాధ్యాయ, ఉద్యోగులు స్థానిక రెవెన్యూ కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐకాస ఛైర్మన్ రాధాకృష్ణ, నాయకులు నిరంజన్కుమార్, పింఛనర్ల సంఘం కార్యదర్శి ఇబ్రహీం, మల్లికార్జున, ఎన్జీవో నాయకులు, ఉపాధ్యాయులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
కంభం : నినదిస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు
మార్కాపురం పట్టణం: పట్టణంలోని కోర్టు కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి బుధవారం ఐకాస నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఐకాస నాయకులు ఓ.వీరారెడ్డి , నాగేంద్రరెడ్డి, చెంచిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఝాన్సీపాల్, శ్రీరాములు, రవిచంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
దర్శి : ఎంపీీడీవో కార్యాలయ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి తమ నిరసన తెలిపారు. ఏపీీటీఎఫ్ (257) జిల్లా అధ్యక్షులు కీర్తి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, నాయకులు చక్రధర్, కృష్ణ, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సీీపీీఎస్ నాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పెద్దదోర్నాల: యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అంబేడ్కర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. మండల యూటీఎఫ్ అధ్యక్షుడు ఎమ్.నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు వర్ధన్, అధ్యక్షురాలు రమణమ్మ, నాయకులు సుధాకర్రావు, రామకృష్ణనాయక్, కాశీరాములు, వెంకయ్య, కిషోర్ పాల్గొన్నారు. తాళ్లూరు : ఉపాధ్యాయులు, ఉద్యోగులు గ్రామ శివారునున్న అంబేడ్కర్ విగ్రహం వరకూ ప్రదర్శనగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. పొదిలి: ఏబీఎం కాంపౌండ్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో, ఉపాధ్యాయ సంఘాలు, పింఛనర్ల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు ఎన్.శ్రీనివాసులరెడ్డి, పి.రమణారెడ్డి, అబ్దుల్హై, ఎ.బాదుల్లా, రఫీ, నాగూర్వలీ తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం పట్టణం: అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న ఉద్యోగులు
పెద్దదోర్నాల : అంబేడ్కర్ చిత్రపటానికి వినతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
[ 24-04-2024]
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. -
అన‘కొండలు’ తిన్న మన్ను.. రూ.860 కోట్లు
[ 24-04-2024]
తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి. -
ఇది కాదా.. జగన్నాటకం!
[ 24-04-2024]
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం. -
నామినేషన్ల వేళ మారిన పేర్లు
[ 24-04-2024]
నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. -
అరవీర ‘రంగు’ మార్తాండ
[ 24-04-2024]
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. -
క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
[ 24-04-2024]
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి
[ 24-04-2024]
పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. -
అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు
[ 24-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. -
తెదేపాలో చేరికల జోరు
[ 24-04-2024]
తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. -
కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
[ 24-04-2024]
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. -
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.