పేరంగుడిపల్లి.. కన్నీట మునిగి..
ఆ ఇద్దరు విద్యార్థులు అప్పటి వరకు గణతంత్ర వేడుకల్లో తోటి వారితో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంటికెళ్లారు. అనంతరం మరికొందరితో కలిసి ఈత నేర్చుకునేందుకు సరదాగా వెళ్లారు. ఈ క్రమంలో నీటిలోని బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన కనిగిరి మండలం పేరంగుడిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది.
ఈతకు వెళ్లి ఇద్దరు బాలుర మృతి
లోకేష్ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి భాగ్యమ్మ, బంధువులు
కనిగిరి, న్యూస్టుడే: ఆ ఇద్దరు విద్యార్థులు అప్పటి వరకు గణతంత్ర వేడుకల్లో తోటి వారితో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంటికెళ్లారు. అనంతరం మరికొందరితో కలిసి ఈత నేర్చుకునేందుకు సరదాగా వెళ్లారు. ఈ క్రమంలో నీటిలోని బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన కనిగిరి మండలం పేరంగుడిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది.
వేడుకల్లో ఆనందంగా...: పేరంగుడిపల్లి సర్పంచి ఇండ్లా సుజాత, మాలకొండరాయుడు దంపతుల కుమారుడు దినేష్(14). అదే గ్రామానికి చెంది ఇండ్లా శ్రీనివాసులు, భాగ్యమ్మల కుమారుడు లోకేష్(14). వీరిద్దరూ వరుసకు సోదరులు. కనిగిరి నగర పంచాయతీ చింతలపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఉదయాన్నే హాజరయ్యారు. తోటి విద్యార్థులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్ నిర్మాణ పనులకు అవసరమైన మట్టి కోసం ఆ గ్రామ సమీపంలో పెద్ద గోతులు తవ్వారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిలిచింది. తరగతులు లేకపోవడంతో మరికొందరితో కలిసి ఈత నేర్చుకునేందుకు గోతుల వద్దకు వెళ్లారు.
బురదలో చిక్కుకుని.. బయటికి రాలేక...: దినేష్, లోకేష్ కొద్దిసేపు తక్కువ లోతు ఉన్న ప్రదేశంలో ఈత కొట్టారు. కొద్దిసేపటి తర్వాత లోకేష్ లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లి మునిగి పోసాగాడు. విషయాన్ని గమనించిన దినేష్ అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. బురదలో కాళ్లు కూరుకుపోవడంతో బయటికి రాలేకోయాడు. ఈ క్రమంలో దినేష్ కూడా నీటిలో పడిపోయాడు. విషయాన్ని గమనించిన అక్కడే ఉన్న మరి కొందరు విద్యార్థులు సమీపంలోని తోటల్లో ఉన్న వారికి చెప్పారు. వారు అక్కడికి చేరుకుని విద్యార్థులను బయటికి తీశారు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఏఎస్సై ముల్లా అహ్మద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
కుమారుల మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఒకే రోజు ఇద్దరు చిన్నారుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దినేష్, లోకేష్(పాత చిత్రాలు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
[ 24-04-2024]
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. -
అన‘కొండలు’ తిన్న మన్ను.. రూ.860 కోట్లు
[ 24-04-2024]
తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి. -
ఇది కాదా.. జగన్నాటకం!
[ 24-04-2024]
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం. -
నామినేషన్ల వేళ మారిన పేర్లు
[ 24-04-2024]
నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. -
అరవీర ‘రంగు’ మార్తాండ
[ 24-04-2024]
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. -
క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
[ 24-04-2024]
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి
[ 24-04-2024]
పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. -
అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు
[ 24-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. -
తెదేపాలో చేరికల జోరు
[ 24-04-2024]
తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. -
కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
[ 24-04-2024]
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. -
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్