నిందితులను త్వరలోనే పట్టుకుంటాం
హత్యకు గురైన బాలుడి ఉదంతంలో నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటామని ఓఎస్డీ చౌడేశ్వరి తెలిపారు. బాలుడి మృతదేహం లభ్యమైన బావిని బుధవారం ఆమె పరిశీలించారు. సమీపంలోని మద్యం సీసాలు, అనుమానిత వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిందితులు పక్కా
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఓఎస్డీ చౌడేశ్వరి, సీఐ
కొమరోలు గ్రామీణం, న్యూస్టుడే: హత్యకు గురైన బాలుడి ఉదంతంలో నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటామని ఓఎస్డీ చౌడేశ్వరి తెలిపారు. బాలుడి మృతదేహం లభ్యమైన బావిని బుధవారం ఆమె పరిశీలించారు. సమీపంలోని మద్యం సీసాలు, అనుమానిత వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిందితులు పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు ఉందన్నారు. బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్థులను విచారిస్తున్నామని తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బలగాలను కేటాయించామన్నారు. పోస్టుమార్టం అనంతరం గ్రామానికి బాలుడి మృతదేహం తీసుకురాగా, గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా డీఎస్పీ కిశోర్కుమార్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలతో బందోబస్తు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!