logo

ధ్రువతారలకు నివాళి

సినీ వినీలాకాశంలో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీదేవి ధ్రువతారలుగా నిలిచిపోతారని వక్తలు పేర్కొన్నారు. సంవత్సరాలు వేరైనా జనవరి నెలలోనే మృతి చెందిన వీరి సంస్మరణసభ అభ్యుదయనగర్‌ కేర్‌ అండ్‌ క్యూర్‌ ఆసుపత్రి ఆవరణలో బుధవారం సాయంత్రం నిర్వహించా

Published : 27 Jan 2022 06:36 IST

అద్దంకి, న్యూస్‌టుడే: సినీ వినీలాకాశంలో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీదేవి ధ్రువతారలుగా నిలిచిపోతారని వక్తలు పేర్కొన్నారు. సంవత్సరాలు వేరైనా జనవరి నెలలోనే మృతి చెందిన వీరి సంస్మరణసభ అభ్యుదయనగర్‌ కేర్‌ అండ్‌ క్యూర్‌ ఆసుపత్రి ఆవరణలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. కళామతల్లికి వారు చేసిన సేవలు చిరస్మరణీయమని నందమూరి కళాపరిషత్‌ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు పేర్కొన్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పీసీహెచ్‌ కోటయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో లక్కరాజు శ్రీనివాసరావు, రాఘవరావు, నారాయణరావు, రఘురామశర్మ, వెంకట్రావు, రఘుచంద్‌, వెంకట సీతారామాంజనేయులు, షేక్‌ ఖాసిం, మస్తాన్‌, చిన్నా, హనుమంతరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని