విస్తీర్ణంమనమే పెద్దలం
రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో పాటు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇందులో పొందుపరిచిన ప్రకారం.. 38 మండలాలు, 8 శాసనసభ నియోజకవర్గ స్థానాలు.. మొత్తం 14,322 చ.కి.మీ విస్తీర్ణంతో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలన్నింటిలో ప్రకాశమే అతి పెద్దదిగా ఆవిర్భవించనుంది
14,322 చ.కి.మీ.. 22.88 లక్షల జనాభా
రెవెన్యూ డివిజన్లుగా ఒంగోలు, మార్కాపురం, పొదిలి
ఈనాడు డిజిటల్, ఒంగోలు: రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో పాటు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇందులో పొందుపరిచిన ప్రకారం.. 38 మండలాలు, 8 శాసనసభ నియోజకవర్గ స్థానాలు.. మొత్తం 14,322 చ.కి.మీ విస్తీర్ణంతో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలన్నింటిలో ప్రకాశమే అతి పెద్దదిగా ఆవిర్భవించనుంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 22.88 లక్షలుగా ఉండనుంది. ఒంగోలు, మార్కాపురం, పొదిలి రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు కానుంది. గతంలో 56 మండలాలు ఉండగా.. కొత్త జిల్లాలో 38 మాత్రమే ఉంటాయి. మిగిలిన 18 మండలాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు బాపట్ల(చీరాల, అద్దంకి, పర్చూరు), నెల్లూరు(కందుకూరు) జిల్లాల్లో విలీనం అవుతాయి.
వినిపిస్తున్న నిరసన గళాలు...: జిల్లా విభజన.. రెవెన్యూ డివిజన్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై నిరసన గళాలు వినిపిస్తున్నాయి. మార్కాపురం, నల్లమల జిల్లాగా ఏర్పాటు చేయాలని పశ్చిమ ప్రకాశం వాసులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే వెనకబడిన ప్రాంతం అయిన మార్కాపురానికి ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఇందుకుగాను మార్కాపురం జిల్లా సాధన ఐక్యవేదిక, సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలూ చేస్తున్నారు.
కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపడంపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కలపడం పైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే దూరాభారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త రెవెన్యూ డివిజన్లు ఇలా...
మార్కాపురం రెవెన్యూ డివిజన్: మొత్తం మండలాలు 13(మార్కాపురం, గిద్దలూరు, బేస్తవారపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్థవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు).. ః తర్లుపాడు మండలం ఇప్పటి వరకు కందుకూరు డివిజన్లో ఉంది.
ఒంగోలు రెవెన్యూ డివిజన్: మొత్తం మండలాలు 12(ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు, మర్రిపూడి, జరుగుమల్లి, కొండపి, పొన్నలూరు, సింగరాయకొండ). ః ఇందులో మర్రిపూడి, కొండపి, జరుగుమల్లి, పొన్నలూరు, సింగరాయకొండ మండలాలు ఇప్పటి వరకు కందుకూరు డివిజన్లో ఉన్నాయి.
పొదిలి రెవెన్యూ డివిజన్: మొత్తం మండలాలు 13(పొదిలి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, సీఎస్పురం, పావ΄రు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లవ΄రు, తాళ్లూరు).
ఇందులో అన్ని మండలాలు కందుకూరు డివిజన్ పరిధిలోనే ఉండేవి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్