పోలీస్ స్టేషన్కు పిలిచి వేధింపులు
వివాహిత అదృశ్యం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు గత కొద్ది రోజులుగా తరచూ స్టేషన్కి పిలిచి వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఉదంతమిది. ఈ సంఘటన గురువారం మార్కాపురంలో చోటుచేసుకుంది. మార్కాపురం
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మార్కాపురం గడియార స్తంభం న్యూస్టుడే : వివాహిత అదృశ్యం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు గత కొద్ది రోజులుగా తరచూ స్టేషన్కి పిలిచి వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఉదంతమిది. ఈ సంఘటన గురువారం మార్కాపురంలో చోటుచేసుకుంది. మార్కాపురం మండలం ఏబీఎంపాలేనికి చెందిన ఎ.లక్ష్మీ, సుదర్శన్ దంపతుల కుమారై శ్రావణి(21)కి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆమె కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదంటూ లక్ష్మీ ఏప్రిల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పదిరోజుల్లో ఆచూకీ కనిపెట్టాలని న్యాయస్థానం పోలీసులకు ఆదేశించడంతో దర్యాప్తులో వేగం పెంచారు. పలువురిని స్టేషన్కి పిలిచి విచారిస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాలకు చెందిన కొల్లా రాజు(35)ను కొద్ది రోజులుగా విచారణ పేరుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కాపురం పోలీస్స్టేషన్లో ఉంచుతున్నారు. తరచూ నంద్యాలకు వెళ్లి రావడానికి ఇబ్బందిగా ఉండటంతో మార్కాపురం సమీప రాయవరంలోని సమీప బంధువుల ఇంట్లో రాజు దంపతులు ఉంటున్నారు. గురువారం పట్టణంలోని తర్లుపాడు రహదారి శివారు ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును రాజు తాగేశారు. భార్య వెంటనే 108కి చేయగా వారు ఘటనా స్థలానికి చేరుకొని రాజును ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఒంగోలు రిమ్స్కు తరలించాలని సూచించారు. దీంతో ఇదే కేసులో అదుపులో ఉన్న మరికొందరు అనుమానితులను పోలీసులు వెంటనే పంపించి వేశారు. మార్కాపురం సీఐ ఆంజనేయరెడ్డిని ‘న్యూస్టుడే’ వివరణ కోరగా రాజును కేసు దర్యాప్తులో భాగంగా మాత్రమే స్టేషన్కి పిలిపించి, పెద్దమనుషుల సమక్షంలో విచారిస్తున్నామన్నారు. ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని... వారి ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్టర్ జగన్
[ 20-04-2024]
ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు మిలటరీ కాలనీకి చెందిన రమణమ్మ అనే మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పదో వారంలో వ్యాక్సిన్ వేయించడానికి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది స్టాక్ లేదని చెప్పారు. -
కిరాయికి కేటుగాళ్లు
[ 20-04-2024]
ఒకప్పుడు జిల్లాలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు వాళ్లు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి ఖాళీగా ఉన్నారు. ఇటువంటి వారితో అధికార పార్టీ కొత్త కుట్రలకు తెర లేపింది. -
అడవిలో ఇళ్లిచ్చిన అన్న
[ 20-04-2024]
నవరత్నాలు..పేదలందరికీ ఇళ్లు అంటూ జగన్ ప్రకటనతో మురిసిపోయిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ముఖ్యమంత్రి చెప్పిన మర్మం అయిదేళ్ల తర్వాత తెలియడంతో వారంతా ఖిన్నులయ్యారు. -
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
[ 20-04-2024]
ఎన్నికల కోడ్కు ముందు మార్కాపురం మున్సిపాలిటీలోని ఆ కీలక పోస్టు ఖాళీ అయ్యింది. -
రాజుకున్న ఎన్నికల వేడి
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నామినేషన్ల పర్వం రెండో రోజైన శుక్రవారం.. భారీ ప్రదర్శనలతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. -
రగడ.. ఇదేం మర్యాద
[ 20-04-2024]
క్రమశిక్షణకు మారుపేరుగా ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్ఐటీలో పరిస్థితులు అదుపు తప్పాయి. -
వైభవం.. రాములోరి రథోత్సవం
[ 20-04-2024]
శ్రీరామ నవమి నాటి నుంచి మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. -
ఒట్టు పెడుతున్నాం.. ఓటు వినియోగించుకుంటాం
[ 20-04-2024]
స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోని ఉద్యోగులు, కార్మికులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు. -
నగదు చోరీలో ఇంటి దొంగలు
[ 20-04-2024]
ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సీఎంఎస్ వాహనం నుంచి గురువారం చోరీకి గురైన రూ.66 లక్షల నగదు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. -
నామినేషన్ల వేళ.. తీరుమారని వైకాపా
[ 20-04-2024]
గిద్దలూరు నగర పంచాయతీలో శుక్రవారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి నామినేషన్ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేపట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
‘సొంత చెల్లినే గెంటేసిన వ్యక్తి జగన్’
[ 20-04-2024]
కష్టకాలంలో తనను ఆదుకున్న సొంత చెల్లినే బయటకు గెంటేసిన వ్యక్తి సీఎం జగన్ అని తెదేపా జోన్-4 పరిశీలకుడు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి వివరించారు. -
నామపత్ర సంబరం
[ 20-04-2024]
నామపత్రాల సమర్పణకు శుక్రవారం సుమూహూర్తం కావడంతో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. -
కోలాహలంగా ఎరిక్షన్బాబు నామినేషన్
[ 20-04-2024]
యర్రగొండపాలెం తెదేపా ఉమ్మడి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు శుక్రవారం నామినేషన్ వేశారు. -
వీధిన పడ్డ బతుకులు
[ 20-04-2024]
ఈ అయిదేళ్ల వైకాపా పరిపాలనలో పేద, మధ్య తరగతుల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. -
తెదేపాలో చేరికల ఉత్సాహం
[ 20-04-2024]
దర్శి తెదేపాలో చేరికల జోరు కొనసాగుతోంది. పలువురు నాయకులు, కార్యకర్తలు అధికార వైకాపాను వీడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!