logo

చంద్రగిరిలో దర్శి యువకుడి దుర్మరణం

ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా పై నుంచి పడి  దర్శి మండలం, సామంతపూడి ఎస్సీ కాలనీకి చెందిన కార్మికుడు చిన్నబాబు అలియాస్‌ ఎర్రయ్య (19) దుర్మరణం పాలయ్యాడు. చిత్తూరు పరిధి చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ మల్లయ్యపల్లిలో

Published : 20 May 2022 02:02 IST


చినబాబు(పాత చిత్రం)

దర్శి, చంద్రగిరి-న్యూస్‌టుడే: ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా పై నుంచి పడి  దర్శి మండలం, సామంతపూడి ఎస్సీ కాలనీకి చెందిన కార్మికుడు చిన్నబాబు అలియాస్‌ ఎర్రయ్య (19) దుర్మరణం పాలయ్యాడు. చిత్తూరు పరిధి చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ మల్లయ్యపల్లిలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వ్యక్తి రెండంతస్తుల ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఇంటి వెలుపల ప్లాస్టరింగ్‌ పనులు చేస్తున్నారు. రెండో అంతస్తు నుంచి ప్లాస్టరింగ్‌ పనులు చేస్తున్న క్రమంలో సారవా  కొయ్య విరిగి... పనులు చేస్తున్న ఎర్రయ్య, ప్రశాంత్‌ కిందపడ్డారు. ప్రహరీ కోసం నిర్మించిన కాంక్రీట్‌ బీమ్‌పై ఎర్రయ్య పడటంతో తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతిచెందాడు. మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ శ్రీనివాసులు, ఎస్సై హిమబిందు సంఘటనా స్థలిని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.  ఎర్రయ్య మృతి విషయం తెలిసి... తల్లిదండ్రులు సరోజనమ్మ, కోటేష్‌ చంద్రగిరికి బయలుదేరారు. చేతికి అందివస్తాడుకున్న కుమారుడు ఇలా మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎర్రయ్య వారికి రెండో సంతానం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని