logo

వైకాపాలో నిరసన గళం

నాగులుప్పలపాడు మండలంలో నిజమైన వైకాపా కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని... పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని... ఆ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమలపు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎంపీపీ క్యాంపు

Published : 20 May 2022 02:02 IST

నాగులుప్పలపాడులో సమావేశమైన నాయకులు


సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణారెడ్డి, హాజరైన నాయకులు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: నాగులుప్పలపాడు మండలంలో నిజమైన వైకాపా కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని... పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని... ఆ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమలపు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎంపీపీ క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ గెలుపు కోసం నాయకులను భుజాలపై మోసిన కార్యకర్తలపై కేసులు పెట్టడం దారుణమన్నారు. వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. మండలంలో పార్టీ పరిస్థితి, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని... మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. కార్యక్రమంలో మారెడ్డి సుబ్బారెడ్డి, కంచర్ల సుధాకర్, పోలినేని కోటేశ్వరరావు, ఇస్తర్ల అంజయ్య, పేరాల చెన్నకేశవులు, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని