ఉత్కంఠగా చీరాల, పర్చూరు పంచాయితీ
దాదాపు రెండేళ్లుగా అధికారపార్టీకి తలనొప్పిగా మారిన చీరాల వ్యవహారం చివరి అంకానికి వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి తెదేపా అభ్యర్థిగా కరణం
సీఎంను కలిసి వచ్చిన ఆమంచి, బాలినేని
ఈనాడు డిజిటల్, ఒంగోలు: దాదాపు రెండేళ్లుగా అధికారపార్టీకి తలనొప్పిగా మారిన చీరాల వ్యవహారం చివరి అంకానికి వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి తెదేపా అభ్యర్థిగా కరణం బలరామకృష్ణమూర్తి గెలిచారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో 2020లో కరణం వైకాపాకు మద్దతు పలకగా.. ఇదే సమయంలో ఆయన కుమారుడు వెంకటేష్ వైకాపాలో చేరారు. అయితే వైకాపా నుంచి పోటీచేసి ఓటమి పాలైన ఆమంచి కృష్ణమోహన్, కరణం మధ్య మాత్రం నువ్వా..నేనా అన్నట్లుగానే రాజకీయాలు కొనసాగుతూ వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ ఇరువర్గాల మధ్యనే పోటీ సాగింది. చీరాల పంచాయితీని తేల్చేందుకు అప్పుడు మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నించినా వీలుపడలేదు. ఆమంచిని పర్చూరుకు పంపే ప్రయత్నాలు జరిగినా ససేమిరా అంటూ ఆయన స్తబ్దుగా ఉంటూ వచ్చారు. ఇటీవల చీరాల ఇన్ఛార్జిగా వెంకటేష్, కొండపి ఇన్ఛార్జిగా వరికూటి అశోక్బాబు, పర్చూరుకు గాదె మధుసూదన్రెడ్డికి బాధ్యతలు అప్పగించేలా పార్టీ అధిష్ఠానాన్ని వైకాపా సమన్వయకర్త బాలినేని ఒప్పించారు. గత వారంరోజులుగా వెంకటేష్ ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతలో పర్చూరు సమన్వయకర్తగా గాదె స్థానంలో ఆమంచికి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనాయకత్వం నుంచి పిలుపురావడంతో మూడు రోజుల క్రితం ఆమంచి విజయవాడ వెళ్లి తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జలతోను, అనంతరం సీఎం జగన్తో సమావేశమై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇదే సమయంలో బాలినేని ధోరణినీ తెలియజేసినట్లు సమాచారం. ఇక గురువారం బాలినేని కూడా సీఎంను కలిశారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొన్ని మార్పులు జరిగాయని.. ఆ వివరాలు దావోస్ నుంచి వచ్చిన తర్వాత ప్రకటిస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాల సమన్వయకర్తల విషయంలో ఏం తేలనున్నదీ, ఎవరి పంతం నెగ్గుతుందన్నది ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి