ఉత్కంఠగా చీరాల, పర్చూరు పంచాయితీ
సీఎంను కలిసి వచ్చిన ఆమంచి, బాలినేని
ఈనాడు డిజిటల్, ఒంగోలు: దాదాపు రెండేళ్లుగా అధికారపార్టీకి తలనొప్పిగా మారిన చీరాల వ్యవహారం చివరి అంకానికి వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి తెదేపా అభ్యర్థిగా కరణం బలరామకృష్ణమూర్తి గెలిచారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో 2020లో కరణం వైకాపాకు మద్దతు పలకగా.. ఇదే సమయంలో ఆయన కుమారుడు వెంకటేష్ వైకాపాలో చేరారు. అయితే వైకాపా నుంచి పోటీచేసి ఓటమి పాలైన ఆమంచి కృష్ణమోహన్, కరణం మధ్య మాత్రం నువ్వా..నేనా అన్నట్లుగానే రాజకీయాలు కొనసాగుతూ వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ ఇరువర్గాల మధ్యనే పోటీ సాగింది. చీరాల పంచాయితీని తేల్చేందుకు అప్పుడు మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నించినా వీలుపడలేదు. ఆమంచిని పర్చూరుకు పంపే ప్రయత్నాలు జరిగినా ససేమిరా అంటూ ఆయన స్తబ్దుగా ఉంటూ వచ్చారు. ఇటీవల చీరాల ఇన్ఛార్జిగా వెంకటేష్, కొండపి ఇన్ఛార్జిగా వరికూటి అశోక్బాబు, పర్చూరుకు గాదె మధుసూదన్రెడ్డికి బాధ్యతలు అప్పగించేలా పార్టీ అధిష్ఠానాన్ని వైకాపా సమన్వయకర్త బాలినేని ఒప్పించారు. గత వారంరోజులుగా వెంకటేష్ ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతలో పర్చూరు సమన్వయకర్తగా గాదె స్థానంలో ఆమంచికి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనాయకత్వం నుంచి పిలుపురావడంతో మూడు రోజుల క్రితం ఆమంచి విజయవాడ వెళ్లి తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జలతోను, అనంతరం సీఎం జగన్తో సమావేశమై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇదే సమయంలో బాలినేని ధోరణినీ తెలియజేసినట్లు సమాచారం. ఇక గురువారం బాలినేని కూడా సీఎంను కలిశారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొన్ని మార్పులు జరిగాయని.. ఆ వివరాలు దావోస్ నుంచి వచ్చిన తర్వాత ప్రకటిస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాల సమన్వయకర్తల విషయంలో ఏం తేలనున్నదీ, ఎవరి పంతం నెగ్గుతుందన్నది ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Weather Forecast: చురుగ్గా రుతుపవనాల కదలిక.. తెలంగాణలో నేడు భారీ వర్షాలు
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
-
Crime News
Crime News: షాకింగ్! ఆసుపత్రిలో శిశువును ఎత్తుకెళ్లిన శునకాలు.. ఆపై విషాదం!
-
India News
Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
-
General News
Health: పాడైన చిగుళ్లను బాగు చేసుకోవచ్చు..ఎలానో తెలుసా..?
-
World News
Joe Biden: బైడెన్ సతీమణి, కుమార్తెపై రష్యా నిషేధాజ్ఞలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- గెలిచారు.. అతి కష్టంగా
- డీఏ బకాయిలు హుష్కాకి!
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
- Ire vs Ind: ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం.. సిరీస్ కైవసం
- Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్ను కలిసిన ఫడణవీస్
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!