ఆమ్మో..అల్లరిమూకల ఆగడాలు
2020 సెప్టెంబరు 9న ఇరువర్గాల మధ్య మార్కాపురంలో తలెత్తిన ఆధిపత్య పోరు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ పథకం ప్రకారం చోటుచేసుకున్న ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. జైలు నుంచి విడుదలైన వారిపై ప్రత్యర్థులు ఒక్కసారిగా కత్తులతో
అదుపు తప్పుతున్న శాంతిభద్రతలు
పాఠశాల ఆవరణలో ధ్వంసమైన కుర్చీలు.. చిందరవందరగా సామగ్రి
మార్కాపురం గడియార స్తంభం, న్యూస్టుడే: 2020 సెప్టెంబరు 9న ఇరువర్గాల మధ్య మార్కాపురంలో తలెత్తిన ఆధిపత్య పోరు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ పథకం ప్రకారం చోటుచేసుకున్న ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. జైలు నుంచి విడుదలైన వారిపై ప్రత్యర్థులు ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడి విచక్షణారహితంగా దాడి చేయడంతో ఓ యువకుడు అక్కడిక్కడడే మృతిచెందాడు. ఈ ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని అల్లరిమూకల ఆగడాలపై ఉక్కుపాదం మోపారు. అల్లర్లకు పాల్పడే కొందరిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించారు. బైండోవర్ కేసులు నమోదు చేసి నిఘా ఉంచారు. దీంతో చాలా వరకు శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. క్రమేణా పట్టు సడలించడంతో మళ్లీ ఆగడాలు శ్రుతిమించుతున్నాయి.
దుకాణం పైనా తెగబడి...: మార్కాపురంలో గురువారం రాత్రి ఇరు వర్గాలకు చెందినవారు దాడులు, ప్రతిదాడులు చేసుకోవడమే కాకుండా ఒకరిపై సర్జికల్ బ్లేడ్తో గొంతుపై గాయపరిచే వరకు పరిస్థితి వెళ్లింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్కు కూతవేటులో దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పట్టణ వాసులు ఉలిక్కిపడ్డారు. దాడి అనంతరం తమకు మత్తుమందులు ఇవ్వాలని ఓ ఔషధ దుకాణ యజమానిని యువకులు కోరడం.. అందుకు నిరాకరించడంతో అతనిపై కూడా దాడికి ప్రయత్నించారు. అదే సమయంలో దుకాణంలో ఉన్న కుర్చీలు విరగ్గొట్టారు. సామగ్రిని ధ్వంసం చేశారు.
రక్షణగా పెంచి పోషిస్తూ..!: పట్టణంలోని ఓ విలువైన స్థలానికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్త తన అనుచర గణాన్ని పాఠశాల ఆవరణలోని ఓ గదిలో ఉంచి ఆ స్థలానికి నిత్యం పహారా కాయిస్తున్నారు. ఇలా ఉంటున్న వారితో ఈ ప్రాంతం క్రమేణా అల్లరిమూకలకు అడ్డగా మారుతోంది. వీరి ఆగడాలతో పాఠశాల నిర్వహణ సమయంలో విద్యార్థినులు కూడా అసౌకర్యానికి గురవ్వడం గమనార్హం. వెకిలి చేష్టలతో వారిని ఇబ్బందులకు గురిచేసినప్పటికీ నిలువరించే సాహసాన్ని అక్కడి బోధన, బోధనేతర సిబ్బంది చేయలేక నిస్సహాయులుగా ఉండిపోయారు.
పాఠశాలే అడ్డాగా ఇష్టారాజ్యం...
పాఠశాలలో ఉంటున్న వారికి తోడు బయట నుంచి ఇతరులూ పదుల సంఖ్యలో అక్కడికి చేరుతున్నారు. మత్తులో ఒకరిపై ఒకరు దాడులు.. ప్రతిదాడులకు తెగబడుతున్నప్పటికీ పట్టించుకున్న వారు లేకపోతున్నారు. ఆర్టీసీ బస్డాండ్ వద్ద నుంచి పూలసుబ్బయ్య కాలనీ వరకు.., కళాశాల రహదారి నుంచి పదో వార్డు శివారు ప్రాంతం వరకు అల్లరిమూకలు తమదే రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణదారులు తమకు అప్పు ఇవ్వకున్నా బెదిరింపులకు గురిచేస్తున్నారు. రాత్రి వేళల్లో సామగ్రిని ధ్వంసం చేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు గురువారం రాత్రి పాఠశాల ప్రధాన ద్వారం తాళాలు పగులగొడుతుండగా కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన అతను తన వద్ద సర్జికల్ బ్లేడ్తో దాడి చేశాడు. ఈ ఘటనలో పట్టణానికి చెందిన కందుల మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తికి మెడ భాగంలో గాయమైంది. త్రుటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డట్లు వైద్యులు తెలిపారు. ఈ ఉదంతంలో దాడికి పాల్పడ్డ యువకుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కానీ రిమాండ్కు తరలించడంలో మీనమేషాలు లెక్కిస్తుండటం శోచనీయం.
ఇప్పటికైనా మేల్కొంటే మేలు...
మార్కాపురం పట్టణంలో గతంలో పోలీసు రికార్డుల్లో ఉన్న వారితో పాటు, ఆగడాలకు పాల్పడుతున్న కొత్త వారిపై పోలీసులు ఇప్పటికైనా దృష్టి సాధించాలి. అల్లర్లకు పాల్పడే అసాంఘిక శక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే పట్టణంలో శాంతిభద్రతలు అదుపు తప్పే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గురువారం చోటుచేసుకున్న దాడిలో గాయపడిన యువకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్