logo

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని దొడ్డవరప్పాడు ప్రధాన కూడలిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు రాజపానకాల రోడ్డుకు చెందిన చేజర్ల సుబ్బారావు

Published : 21 May 2022 06:30 IST

మద్దిపాడు, న్యూస్‌టుడే: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని దొడ్డవరప్పాడు ప్రధాన కూడలిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు రాజపానకాల రోడ్డుకు చెందిన చేజర్ల సుబ్బారావు(65) పెద కొత్తపల్లిలోని దర్గాకు వచ్చారు. అక్కడ పూజలు ముగిసిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో దొడ్డవరప్పాడు వద్ద రహదారి నడుచుకుంటూ రహదారి దాటుతుండగా.. అదే సమయంలో అటుగా వేగంగా వస్తున్న కారు సుబ్బారావును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడకక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని