logo

చెల్లిని చూసొస్తానని తనువు చాలించారు

మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని గుండ్లాపల్లి పొలాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగులుప్పలపాడు మండలం తక్కెళ్లపాడుకు చెందిన

Published : 21 May 2022 06:34 IST

మద్దిపాడు, న్యూస్‌టుడే: మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని గుండ్లాపల్లి పొలాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగులుప్పలపాడు మండలం తక్కెళ్లపాడుకు చెందిన కోరుగుండ్ల సురేంద్రబాబు(58) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం ఇటీవల హైదరాబాద్‌ వెళ్లి ఓ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని వచ్చారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఉలవపాడులో ఉన్న చెల్లిని చూసి వస్తానని చెప్పి ఈ నెల 18న ఇంటి నుంచి బయటికి వెళ్లారు. ఒక రోజు తర్వాత అక్కడ నుంచి తిరిగి ఇంటికి బయలుదేరారు. మార్గంమధ్యలో గుండ్లాపల్లిలోని పొలాల్లో అతని విగతజీవిగా స్థానికులకు శుక్రవారం కనిపించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీరాం తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని